Congress: 5 లక్షలు.. 4 లక్షలు.. 3 లక్షలు..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట కాంగ్రెస్ పార్టీ మళ్లీ సత్తా చాటింది. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించింది.
కాంగ్రెస్ గెలిచిన చోట బంపర్ మెజార్టీలు
అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట మళ్లీ సత్తా చాటిన హస్తం పార్టీ
తెలుగు రాష్ట్రాల్లో నల్గొండలో సరికొత్త రికార్డు
మహబూబాబాద్, ఖమ్మంలోనూ భారీ ఆధిక్యం
ఈనాడు - హైదరాబాద్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన చోట కాంగ్రెస్ పార్టీ మళ్లీ సత్తా చాటింది. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ సాధించింది. ఉమ్మడి ఏపీ సహా విభజన తర్వాత సైతం తెలుగు రాష్ట్రాల లోక్సభ ఎన్నికల్లో ఎన్నడూ ఎవరికీ రానంతగా 5.59 లక్షల మెజార్టీతో నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంతకాలం ఈ రికార్డు ఉమ్మడి ఏపీలోని కడప లోక్సభ స్థానంలో జగన్(5.4 లక్షల మెజార్టీ) పేరుతో ఉండగా ఇప్పుడు అది చెరిగిపోయింది. నల్గొండ లోక్సభ స్థానానికి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్నగర్లో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యం రావడం విశేషం.
ఖమ్మంలో 2 లక్షల ఓట్ల పెరుగుదల
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం పరిధిలో కాంగ్రెస్కు 2.60 లక్షల ఓట్ల ఆధిక్యం రాగా ఇప్పుడు అక్కడే మరో 2.07 లక్షలు పెరిగి మొత్తం 4.67 లక్షల మెజార్టీ సాధించింది. మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న పొంగులేటి భారీ మెజార్టీ రావడానికి కృషి చేశారు.
గిరిజనుల మనసు దోచి లక్ష ఓట్లు అదనం...
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్న గిరిజన రిజర్వుడు నియోజకవర్గం మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఏకంగా 3.49 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. గతంలో ఇక్కడ 2.42 లక్షల ఓట్ల ఆధిక్యం రాగా ఇప్పుడు 1.07 లక్షల ఓట్లు అదనంగా రావడం విశేషం.
- వరంగల్ నియోజకవర్గ స్థానం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు 1.6 లక్షల ఓట్ల ఆధిక్యం రాగా ప్రస్తుతం కడియం కావ్య 2.2 లక్షల మెజార్టీతో గెలుపు తీరం చేరుకున్నారు. అంటే ఇప్పుడు ఆధిక్యం 60 వేలు పెరిగింది.
- భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి 2.22 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సమన్వయ బాధ్యతలు చేపట్టి తీవ్రంగా కృషిచేయడంతో భారీ ఆధిక్యం వచ్చింది. ఆయన గతంలో ఇక్కడ ఎంపీగా నెగ్గిన అనుభవంతో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించారు.
- పెద్దపల్లిలోనూ గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షల ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు.
- జహీరాబాద్లో గట్టిపోటీ ఎదుర్కొని కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 వేల ఓట్ల ఆధిక్యం సాధించింది. అప్పుడు 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓడినా తిరిగి పుంజుకుని ఆరునెలల వ్యవధిలోనే 48 వేల ఓట్ల మెజార్టీతో లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే ఇప్పుడు మరో 29 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. మంత్రి దామోదర్ రాజనర్సింహ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించారు.
అసెంబ్లీలో ఓడినచోటా మెరుగైన ఓట్ల శాతం
గత నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54 శాసనసభా స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో అప్పటికన్నా మెరుగైన ఓట్లను సాధించింది.
- శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఖానాపూర్ ఒక్కచోటే కాంగ్రెస్ నెగ్గింది. అప్పుడు లోక్సభ పరిధిలో కాంగ్రెస్ 2.57 లక్షల ఓట్లతో 3వ స్థానంలో నిలవగా ఇప్పుడు 4.71 లక్షల ఓట్లు వచ్చాయి. 2.14 లక్షల ఓట్లు ఎక్కువ తెచ్చుకుని మూడు నుంచి రెండోస్థానానికి ఎదిగింది. మంత్రి సీతక్క ఇన్ఛార్జిగా విస్తృతంగా పర్యటించారు.
- నిజామాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4.10 లక్షల ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు అంతకన్నా 70 వేల ఓట్లు అదనంగా తెచ్చుకుని 4.80 లక్షల ఓట్లు సాధించి 2వ స్థానంలోనే నిలిచింది. ఈ స్థానానికి ఎన్నికల ఇన్ఛార్జిగా పి.సుదర్శన్రెడ్డిని పార్టీ నియమించింది.
- గ్రేటర్ హైదరాబాద్లో కలిసి ఉన్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల్లో మూడుచోట్లా కాంగ్రెస్ ప్రస్తుతం 2వ స్థానంలో నిలిచింది. వీటిలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మొత్తం ఓట్లను పరిశీలిస్తే మూడు లోక్సభ స్థానాల్లోనూ అప్పుడూ, ఇప్పుడూ 2వ స్థానంలోనే నిలిచింది. భారాస, భాజపా 1, 3 స్థానాలే అటు, ఇటూ మారాయి. కాంగ్రెస్కు గతం కన్నా ఓట్లు పెరిగాయి.
- మెదక్ పరిధిలో నవంబరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 3.22 లక్షల ఓట్లతో రెండోస్థానం దక్కింది. ఇప్పుడు అవే స్థానాల్లో అంతకన్నా ఎక్కువగా ఓట్లు వచ్చినా 2వ స్థానంలోనే నిలిచింది. మంత్రి కొండా సురేఖ మెదక్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ