Congress: ఓడిన స్థానాల్లో గెలిచి.. గెలిచిన చోట వెనకబడి..
ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన పలు నియోజకవర్గాల్లో.. లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ భారీగా ఓట్లు పెంచుకుంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల పరంగా ఇప్పుడు ఆధిక్యం సాధించింది.
‘చే’జారిన అసెంబ్లీ స్థానాల్లో కొన్నింట ఇప్పుడు ఆధిక్యం
సిటింగ్ ఎమ్మెల్యేలున్నా.. కొన్నిచోట్ల దక్కని మెజారిటీ
లోక్సభ ఎన్నికల్లోనూ 64 సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ పైచేయి
ఈనాడు, హైదరాబాద్
ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన పలు నియోజకవర్గాల్లో.. లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ భారీగా ఓట్లు పెంచుకుంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల పరంగా ఇప్పుడు ఆధిక్యం సాధించింది. లోక్సభ సీట్లు గెల్చుకోని చోట కూడా వాటి పరిధిలోని కొన్ని శాసనసభ స్థానాల్లో ఆరు నెలల క్రితంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్కు మెరుగైన ఓట్లు రావడం విశేషం. మరోవైపు 64 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్కు సిటింగ్ ఎమ్మెల్యేలున్నా.. 15 నియోజకవర్గాల్లో ఆధిక్యం చేజారింది. మిగిలిన 49 సెగ్మెంట్లకు తోడు.. భారాస గెలిచిన 12 స్థానాలు, భాజపా, ఎంఐఎం, సీపీఐ గెలిచిన ఒక్కో స్థానంలో కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ లభించింది. ఇలా లోక్సభ ఎన్నికల్లోనూ మొత్తంగా 64 సెగ్మెంట్లలో కాంగ్రెస్కు ఆధిక్యం దక్కింది.
- నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దీని పరిధిలోని నిజామాబాద్ అర్బన్, జగిత్యాల నియోజకవర్గాల్లో ఆరు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైనా.. లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో అధికంగా ఓట్లు సాధించి మొదటి స్థానానికి రావడం విశేషం.
అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా.. లోక్సభ ఎన్నికల్లో 15,800 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జగిత్యాలలో 54,421 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. అక్కడ గెలిచిన భారాస కంటే కాంగ్రెస్కు 16 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత పుంజుకుని 76,145 ఓట్లతో అగ్రస్థానానికి చేరింది. ఇక్కడ భాజపా పొందిన 74,298 ఓట్ల కంటే కాంగ్రెస్కు 1847 ఓట్ల ఆధిక్యం లభించింది. నిజామాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి సొంత నియోజకవర్గం జగిత్యాల కావడంతో గట్టిగా ప్రచారం చేసి ఆధిక్యాన్ని సాధించారు. నిజామాబాద్ రూరల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 78 వేల ఓట్లొస్తే ఇప్పుడు 56,674కి పడిపోయింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 వేల ఓట్ల మెజార్టీతో నెగ్గినా.. లోక్సభ ఎన్నికల్లో వెనకబడడంతో భాజపాకు ఏకంగా 44,600 ఓట్ల మెజార్టీ లభించింది. రూరల్లో కాంగ్రెస్ నేతలు చురుగ్గా పనిచేయకపోవడం దెబ్బతీసిందని కాంగ్రెస్ వర్గాల అంచనా. బాల్కొండలో కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 65,800 కాగా.. లోక్సభ ఎన్నికల్లో 53,600కి తగ్గాయి. కోరుట్ల, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, జగిత్యాల సెగ్మెంట్లలో కలిపి.. అసెంబ్లీ ఎన్నికలకన్నా కాంగ్రెస్ 73 వేల ఓట్లు అధికంగా సాధించినా.. మొత్తం ఓట్లలో భాజపా కంటే వెనుకబడడంతో ఈ లోక్సభ సీటు ‘చే’జిక్కలేదు.
మెదక్లో రెండుచోట్ల ఆధిక్యం
అసెంబ్లీ ఎన్నికల్లో.. మెదక్ లోక్సభ స్థానం పరిధిలోని నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడే ఎక్కువ ఓట్లు సాధించి మొదటి స్థానానికి చేరింది. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కు ఏకంగా 101 శాతం ఓట్లు పెరిగాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 32,568 ఓట్లతో భారాస, భాజపాల తరువాత మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు 65,539 ఓట్లతో రెండో స్థానానికి చేరింది. మెదక్ స్థానంలో అసెంబ్లీ ఎన్నికల్లో 10,125 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుపొందగా.. ఇప్పుడు భాజపాకన్నా 12 వేల ఓట్లు వెనుకబడి రెండోస్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్లో 87,126 ఓట్లు సాధించిన కాంగ్రెస్కు ఇప్పుడు అక్కడ 55,588 మాత్రమే వచ్చాయి. ఆలస్యంగా ప్రచారం ప్రారంభించడం, అన్ని గ్రామాల్లో తిరగకపోవడం వల్ల మెదక్ సెగ్మెంట్లో ఏకంగా 31,538 ఓట్లు తగ్గిపోయాయి.
గిరిజన ప్రాంతాల్లో తారుమారు
ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు సీట్లలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ 4 వేల ఓట్ల ఆధిక్యంతో నెగ్గింది. అప్పుడు 58 వేల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ భాజపాకు 75 వేల ఓట్లు రావడంతో కాంగ్రెస్ 61 వేల ఓట్లు సాధించినా.. రెండో స్థానానికే పరిమితమైంది. ఆసిఫాబాద్, సిర్పూర్లో మాత్రం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ మొదటి స్థానం సాధించింది. సిర్పూరులో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 8,427 ఓట్లతో నాలుగో స్థానంలో నిలవగా.. ఇప్పుడు 62,956 ఓట్లు సాధించి అగ్రస్థానానికి చేరింది. ఆసిఫాబాద్లో 60,238 నుంచి 73,996 ఓట్లకు పెరిగి.. మొదటి స్థానంలో నిలిచింది. 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చిచూసినా ఈ రెండు నియోజకవర్గాల్లో మెరుగైన ఓట్లను సాధించింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ సొంత గ్రామం సిర్పూరు (యు) మండలంలోని కొల్లార కావడంతో ఏజెన్సీ ప్రాంత గిరిజనులు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేసినట్లు అర్థమవుతోంది. ఈ స్థానానికి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి సీతక్క కూడా విస్తృతంగా ప్రచారం చేయడం కలసి వచ్చింది. గిరిజనులు, దళితుల ఓట్లున్న ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ మెరుగైన ఓట్లు సాధించగా.. లోక్సభ బరిలో అంతకన్నా మెరుగైన ఫలితాలను సాధించింది. మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ నియోజకవర్గం పరిధిలోని భద్రాచలం సెగ్మెంట్లో కాంగ్రెస్ 5,719 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు అదే సెగ్మెంట్లో 34,231 ఓట్ల ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచింది.
రాజధానిలో మూడు చోట్ల..
అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం మూడు నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కోల్పోయినా.. ప్రస్తుత ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో.. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో ఓటమిపాలైనా.. ఎంపీ ఎన్నికల్లో... జూబ్లీహిల్స్, నాంపల్లి సెగ్మెంట్లలో మొదటిస్థానం సాధించింది. జూబ్లీహిల్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో 16 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలవగా.. ఇప్పుడు ఆ లోటు పూడ్చుకుని, మరో 25 వేల ఓట్ల ఆధిక్యంతో అగ్రస్థానానికి చేరింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 64,212 ఓట్లతో రెండోస్థానం దక్కగా.. ఇప్పుడు 89,705 ఓట్లతో మొదటి స్థానానికి చేరింది. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 60,148 నుంచి 1,03,155 ఓట్లకు చేరి అగ్రస్థానాన్ని సాధించింది. నాంపల్లిలో ఆరు నెలల క్రితం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో.. ఈ సెగ్మెంట్లో రెండో స్థానంలో నిలిచిన భాజపా కంటే 62 వేలకు పైగా ఓట్లు అధికంగా సాధించి అగ్రస్థానానికి చేరింది. ఇక హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని మలక్పేట, చాంద్రాయణగుట్ట, చార్మినార్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా తక్కువ ఓట్లకే పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి