Lok Sabha Elections: కాంగ్రెస్ మేనిఫెస్టో ఏప్రిల్ 5న.. ఆ మరుసటి రోజే హైదరాబాద్లో మెగా ర్యాలీ!
ఎన్డీయే సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా కృషిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏప్రిల్ 5న విడుదల కానుంది.
దిల్లీ: లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధమైంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో విస్తృత చర్చల ద్వారా రూపొందించిన మేనిఫెస్టోను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఆ మరుసటి రోజు ఏప్రిల్ 6న రాజస్థాన్లోని జైపుర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. జైపుర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే, హైదరాబాద్ మెగా ర్యాలీలో రాహుల్ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. దేశానికి సంక్షేమం అందించడం, అభివృద్ధి అనుకూల విజన్తోనే కాంగ్రెస్ ఎప్పుడూ పనిచేస్తుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ‘పాంచ్ న్యాయ్ ’ పేరిట తమ హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతోపాటు, 25 గ్యారంటీలను ప్రకటించింది. ‘న్యాయ్ పిల్లర్ల’ పేరుతో 25 గ్యారంటీలను ఐదు భాగాలుగా విభజించింది. ‘పీపుల్స్ మేనిఫెస్టో’ పేరుతో దీని రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ డాక్యుమెంట్ను రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
మహా యుద్ధం
మహారాష్ట్రలోని కీలకమైన ముంబయితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యంతో పాటు ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని, హామీ మేరకు వరి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర భాజపా నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. -
లద్దాఖ్లో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది. -
అవినీతి కేసు బూచితో మాలీవాల్ను కుట్రలో భాగం చేశారు
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై ఉన్న అక్రమ నియామకాల కేసును బూచిగా చూపి, బెదిరించి సీఎం కేజ్రీవాల్కు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాజపా ఆమెను పావుగా మార్చిందని ఆప్ ఆరోపించింది. -
జూన్ తొలివారంలోనే ‘రైతు భరోసా’ ఇవ్వాలి
జూన్ తొలి వారంలోనే ‘రైతు భరోసా’ డబ్బులివ్వాలని... పంటసాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా చూడాలని భారాస మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. -
రేవంత్రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు
‘ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు. కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితిలో లేరు. -
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గట్టికౌంటర్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు