Congress: కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: కాంగ్రెస్కు (Congress) పెట్టని కోట అది. మిన్ను విరిగి మీదపడుతున్నా.. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఆశలు చూపినా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థే విజేత. 2019 ఎన్నికల్లో మినహా 1952 నుంచి ఇక్కడ కాంగ్రెస్కు ఎదురు లేదు. కానీ, తాజా ఎన్నికల్లో ఆ స్థానం అంతర్గత పోరుకు వేదికైంది. అక్కడి అభ్యర్థిని ఎంపిక చేయడం పార్టీ హైకమాండ్కు కత్తిమీద సాములా తయారైంది. అదే.. కర్ణాటకలోని కోలార్ (Kolar Lok Sabha Constituency) లోక్సభ నియోజకవర్గం. అసమ్మతి నేతల ధిక్కార స్వరంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. హైమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
మేనల్లుడి కోసం పోరాటం
కోలార్ లోక్సభ స్థానం ఎస్సీ కేటగిరీకి చెందినది. 1952 నుంచి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిదే విజయం. 1991 నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేహెచ్ మునియప్ప ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం సిద్ధరామయ్య సర్కారులో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. తన మేనల్లుడు చిక్క పెద్దన్నకు ఈ టికెట్ ఇప్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపై పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. అదే జరిగితే పార్టీకి రాజీనామా చేస్తామని సీనియర్ నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది.
అదే జరిగితే రాజీనామాలే!
కోలార్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్సీలు పెద్దన్నకు టికెట్ అంశాన్ని తప్పుబడుతున్నారు. అధిష్ఠానం నుంచి వ్యతిరేక నిర్ణయం వస్తే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యనేతలకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా కౌన్సిల్ ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్కు లిఖిత పూర్వకంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ పెద్దన్నకు టికెట్ కేటాయిస్తే కోలార్లో ఎస్సీ ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోతారని, ఫలితంగా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీనియర్ నేతలు పార్టీ హైకమాండ్కు సంకేతాలు పంపారు. పెద్దన్నకు టికెట్ను వ్యతిరేకించిన వారిలో.. జి. మంజునాథ్ (కోలార్ అసెంబ్లీ నియోజకవర్గం), కేవై నంజెగౌడ (మలూర్ అసెంబ్లీ), ఎంసీ సుధాకర్ (చింతామణి అసెంబ్లీ), ఎమ్మెల్సీలు అనిల్ కుమార్, నజీర్ అహ్మద్ ఉన్నారు. వీరిలో సుధాకర్ ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు వ్యతిరేక స్వరం వినిపిస్తూనే.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలు ప్రకటించడం గమనార్హం.
‘‘ పార్టీ హైకమాండ్పై ఎంతో గౌరవం ఉంది. వారసత్వంగా కాకుండా పార్టీలో కష్టపడిన వారికే అవకాశం ఇవ్వాలన్నది మా ఆలోచన. ఇదే ఇక్కడి సమస్య. కొందరు పార్టీ పెద్దలపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి, టికెట్ దక్కించుకోవాలనుకుంటున్నారు. దీనికి మేం వ్యతిరేకం. ఒకవేళ అదే జరిగితే.. మేం ప్రజాప్రతినిధులుగా కొనసాగకుండా.. ఇంట్లోనే కూర్చుంటాం’’ అని మంత్రి సుధాకర్ మీడియాకు వెల్లడించారు. అసమ్మతి నేతలంతా రాజీనామాలకు సిద్ధమవ్వడంతో సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని వారించారు. ఈ సమస్య పరిష్కార బాధ్యతను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బీఎస్ సురేశ్కు అప్పగించారు.
అక్కడ గెలవాలంటే మేమే ఉండాలి!
కోలార్ స్థానంలో పూర్వవైభవం సాధించాలంటే తమ కుటుంబానికి చెందిన వ్యక్తే బరిలో ఉండాలని మునియప్ప అంటున్నారు.కానీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. ‘‘ ఎన్నికల ముందు ఇలాంటి చిన్న అవరోధాలు సహజమే. కాకపోతే, దురదృష్టం కొద్దీ ఇవి తారస్థాయికి చేరాయి. మేమంతా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్లను కలిశాం. పరిస్థితి వివరించాం. నియోజకవర్గ ప్రజల పూర్తి మద్దతు ఉందని చెప్పా. కేవలం ఒకే ఒక్కసారి, అదికూడా గత ఎన్నికల్లోనే ఓటమి ఎదురైందన్న సంగతి వాళ్లకు కూడా తెలుసు. అసమ్మతి నేతలు కూడా కొన్ని పేర్లు ప్రస్తావించారు. అందరం కలిసి నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్కే విడిచిపెట్టాం. ఆ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం’’ అని మునియప్ప మీడియాకు వివరించారు. అయితే, అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఎన్డీయే కూటమి నుంచి ఎవరో?
మరోవైపు ఈ స్థానంపై ఎన్డీయే కూటమిలోనూ స్తబ్ధత నెలకొంది. కోలార్ నియోజకర్గం నుంచి భాజపా బరిలోకి దిగుతుందా? మిత్రపక్షం జేడీఎస్కు కేటాయిస్తుందా? అన్నదానిపై స్పష్టత లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మొత్తం 28 స్థానాలకు గానూ 27 స్థానాల్లో బరిలోకి దిగిన భాజపా 25 చోట్ల విజయం సాధించింది. అందులో కోలార్ కూడా ఒకటి. భాజపా మద్దతుతో మండ్య నుంచి సుమలత గెలుపొందారు. దీంతో కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు ఎన్డీయే కూటమి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇక్కడ పార్టీ జెండాను రెపరెపలాడించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ స్థానానికి రెండో విడతగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు