ఏపీ ఎన్నికలు.. 117 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు దాదాపు ఖరారు!

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది.

Published : 01 Apr 2024 13:13 IST

దిల్లీ: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ మేరకు అభ్యర్థుల జాబితాకు తుది రూపు తీసుకొచ్చినట్లు సమాచారం. సీఈసీ భేటీకి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలతో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. 117 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులుగా పలువురి పేర్లకు ఆ పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం.

కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ షర్మిల, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు సత్యారెడ్డి (విశాఖపట్నం), పళ్లంరాజు (కాకినాడ), జేడీ శీలం (బాపట్ల) అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని