Mamata Banerjee: బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, సీపీఐ(ఎం)లకు అనుకూలంగా ఓట్లు వేయవద్దని ప్రజలను కోరారు. ‘‘పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. కేంద్రంలో ప్రతిపక్షాల కూటమి ఏర్పాటులో నేనే కీలకపాత్ర పోషించాను. కూటమి పేరు కూడా నేనే పెట్టాను. కానీ బెంగాల్లో సీపీఐ (ఎం), కాంగ్రెస్లు భాజపా కోసం పని చేస్తున్నాయి. మీరు భాజపాను ఓడించాలనుకుంటే కాంగ్రెస్, సీపీఐ(ఎం)కు ఓట్లు వేయకండి’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ జనవరిలో ప్రకటించారు. సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్తో వచ్చిన విభేదాల కారణంగా మమత ఈనిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రామనవమి వేడుకల సందర్భంగా భాజపా హింసను ప్రేరేపిస్తోందని, ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింస ‘ముందస్తు ప్రణాళిక’ అని మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే రామనవమి వేడుకల సందర్భంగా జరిగిన హింసాకాండను అడ్డుకొని, బెంగాలీ హిందువులను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని భాజపా ఎదురు దాడికి దిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి