CPI: భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశానికి విపత్తు వచ్చినట్టే: డి.రాజా
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు వచ్చినట్టే అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.
హైదరాబాద్: కేంద్రంలో భాజపా మూడోసారి అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు వచ్చినట్టే అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఆ పార్టీ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘3 రోజులపాటు జరిగిన సమావేశాల్లో రానున్న లోక్సభ ఎన్నికల కోసం ఎలా సన్నద్ధం కావాలో చర్చించాం. మోదీ మరోసారి అధికారంలోకి వస్తానంటున్నారు. కానీ, పదేళ్లలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారు? రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తేలేదేం? మధ్యంతర బడ్జెట్లో పేద, మధ్య తరగతి కోసం ఏమీ లేదు. ఫిబ్రవరి 16న వాణిజ్య, రైతు సంఘాలు నిర్వహించే బంద్కు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మా పూర్తి మద్దతు ఉంటుంది. భాజపా హఠావో దేశ్ బచావో అని మొదటిసారిగా చెప్పిన నీతీశ్ కుమార్ మళ్లీ భాజపా పంచనే చేరారు. ఇండియా కూటమిని మోసం చేసిన నీతీశ్.. చరిత్రలోని చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాలి. రాబోయే ఎన్నికలు చాలా ప్రధానమైనవి.. భాజపాను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. దేశ వ్యాప్తంగా సముచిత స్థానాల్లో పోటీ చేసేలా ‘ఇండియా’ కూటమితో చర్చలు జరుపుతున్నాం. అందుకు సంబంధించి కమిటీ కూడా వేశాం’’ అని తెలిపారు.
‘‘రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ లాంటి వారు సురక్షితంగా ఉన్నారు. ఝార్ఖండ్ మాజీ సీఎం ఈడీ విచారణలో ఉన్నారు. భాజపానే దీనికి కారణం’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. -
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
భారాసకు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్ కాంగ్రెస్లో చేరారు. -
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్