TS Elections: కాంగ్రెస్‌తో పొత్తు కుదిరింది.. సీట్లే తేలాలి: సీపీఐ నారాయణ

ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.

Published : 09 Oct 2023 19:36 IST

హైదరాబాద్‌: ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని.. ఇది కూడా 2 రోజుల్లో కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం కమ్యూనిస్టులకు చెరో 2 సీట్లు అన్నది ప్రచారం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి ప్రతిపాదన మాకు ఇంకా రాలేదు. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలోనూ ఆ తరహా రాజకీయ అవగాహనతో ముందుకెళ్తాం. పొత్తులో సీట్ల అంశం మీద తొందర లేదు. నామినేషన్లు వేసే వరకు సమయం ఉంది. సీట్లపై చర్చలు కొనసాగుతున్నాయి’’ అని నారాయణ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని