Rushikonda: రుషికొండ పర్యటనకు సీపీఐ నారాయణ.. ఆ మార్గంలో పోలీసుల ఆంక్షలు
విశాఖలోని రుషికొండ వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రుషికొండ పర్యటనకు బయల్దేరిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆంక్షలు విధించారు.
విశాఖపట్నం: విశాఖలోని రుషికొండ వైపు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు దిగ్బంధించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రుషికొండ పర్యటనకు బయల్దేరిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను నిలిపేస్తున్నారు. కోర్టు అనుమతి మేరకు నారాయణ ఒక్కరినే రుషికొండ పర్యటనకు అనుమతిస్తామని చెబుతున్నారు.
రుషికొండ పర్యటనకు వెళ్తున్న నారాయణ వాహనాన్ని గీతం యూనివర్సిటీ జంక్షన్లో పోలీసులు ఆపారు. వాహనంలోని మిగిలిన వారిని దించిన తర్వాతే అనుమతిస్తామని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. నారాయణతో పాటు వాహనంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర నేతలు ఉన్నారు. దీంతో నారాయణ మినహా మిగిలిన వారు దిగిపోవాలని పోలీసులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.