CPI: జగన్‌.. ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి: రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఇవాళ తుళ్లూరుకు చేరుకున్న సీపీఐ నేతలకు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు.

Updated : 26 Aug 2023 17:20 IST

అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఇవాళ తుళ్లూరుకు చేరుకున్న సీపీఐ నేతలకు రాజధాని రైతులు ఘనస్వాగతం పలికారు. తుళ్లూరులోని దీక్షా శిబిరం నుంచి రైతులతో రామకృష్ణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారితో మాట్లాడారు.

‘‘అమరావతి రాజధానిగా ఉండాలని గతంలో అందరూ అంగీకరించారు. మాట మార్చిన వ్యక్తిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు. కులం పేరుతో దుష్ప్రచారాలు చేస్తారా? సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? జగన్‌ కంటే పెత్తందారు ఎవరైనా ఉన్నారా? ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి. వైకాపా పాలనలో అన్ని రంగాలు నష్టపోయాయి’’ అని రామకృష్ణ విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు