CPI Ramakrishna: ఏపీ సీఎం అంటే కేంద్రానికి లెక్కే లేదు: రామకృష్ణ
ఏపీ వ్యాప్తంగా కరవు పరిస్థితి అధికంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
విజయవాడ: ఏపీ వ్యాప్తంగా కరవు పరిస్థితి అధికంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కరవు, కృష్ణా జలాల పునఃపంపిణీ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో నేతలు 30 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు.
‘‘కరవుపై సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రంలో కరవు మండలాలు 400 ఉంటే ఆ తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చెబుతోంది. అందుకే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. రాష్ట్రంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. రైతులు, కూలీలు, చేతివృత్తుల వారు వలసలు పోతున్నారు. జీవనం దుర్భరంగా మారడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. ఇంత జరుగుతున్నా సీఎం జగన్లో చలనం లేదు. రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టలేదు.
కరవుపై సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ మాట్లాడటం లేదు. కనీసం కేబినెట్లో అయినా దీనిపై చర్చించని దుర్మార్గ ప్రభుత్వం ఇది. బటన్ నొక్కే మంత్రిగా సీఎం మారారు. ఆ నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాల్లో పూర్తిస్థాయిలో పడటం లేదు. జగన్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. రైతుల గోడు పట్టించుకోని వ్యక్తి సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యం. ఆయన సాయం చేయకపోగా కేంద్రానికి నివేదిక కూడా పంపడం లేదు. ఏపీ సీఎం అంటే కేంద్రానికి లేక్కే లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులను ఆదుకోవాలి’’ అని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!