CPI Ramakrishna: జగన్‌ మూర్ఖత్వం వీడాలి.. అమరావతిని రాజధానిగా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ

అమరావతి రాజధాని ఉద్యమం 1400 రోజులకు చేరిన  సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలియజేశారు.

Updated : 18 Oct 2023 10:23 IST

అమరావతి: అమరావతి రాజధాని ఉద్యమం 1400 రోజులకు చేరిన  సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలియజేశారు. అమరావతి రాజధాని రైతుల, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. కోర్టులను కూడా లెక్కచేయకుండా సీఎం జగన్‌ రాజధాని అంశాన్ని వివాదాస్పదం చేయడం తగదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మూర్ఖత్వం విడనాడి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. మార్గదర్శిపై సీఐడీ మరోసారి తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని