CPI Ramakrishna: మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి: రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా అవకతవకలపై సీఎం జగన్‌ మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Published : 16 Nov 2023 11:01 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా అవకతవకలపై సీఎం జగన్‌ మాట్లాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. వైకాపాకు అనుకూలంగా లేని ఓట్లు తొలగించినట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఒకే డోర్‌ నంబర్‌పై వందల బోగస్‌ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. బోగస్‌ ఓట్లు తొలగించి అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని