CPI Ramakrishna: చంద్రబాబు ఆరోగ్యంపై ఎగతాళిగా మాట్లాడతారా?: సీపీఐ రామకృష్ణ

తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Updated : 14 Oct 2023 13:52 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన ఆరోగ్యం బాలేదంటే ఎగతాళిగా మాట్లాడతారా?అని మండిపడ్డారు. ఆరోగ్యంపై వైద్యులు చెప్పాలి గానీ.. డీఐజీ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.

మరోవైపు, ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ‘‘కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సదస్సు పెడుతున్నారు. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌ పునఃపంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం జగన్‌ దిల్లీలోనే ఉన్నారు. దిల్లీలో ఉండి మరీ దీనిని అడ్డుకోవడంలో జగన్‌ విఫలమయ్యారు. తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు’’ అని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని