CPI: సీపీఐతో పొత్తు ఖాయం.. కొత్తగూడెం కేటాయింపు: రేవంత్‌

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఖాయమైనట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Published : 06 Nov 2023 17:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఖాయమైనట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. ఆ స్థానంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందని చెప్పారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్‌-సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని