Encroach Assigned Lands: ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు సీఎస్ ఒత్తిడి
నెలరోజుల్లో పదవీవిరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి.. రూ.వేల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు.
విశాఖ పరిధిలో జవహర్రెడ్డి భూ కుంభకోణాలపై ఈసీ జోక్యం చేసుకోవాలి
జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్
మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్
ఈనాడు-విశాఖపట్నం, సీతంపేట, న్యూస్టుడే: నెలరోజుల్లో పదవీవిరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి.. రూ.వేల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. ఇప్పటికే ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన 400 ఎకరాల ఎసైన్డ్ భూములను తన కుమారుడ్ని అడ్డం పెట్టి బినామీల పేరిట చేజిక్కించుకున్నారని పేర్కొన్నారు. మరో 400 ఎకరాలను రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. విశాఖలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల కోడ్ వచ్చాక విశాఖ పరిధిలో జరిగిన ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దుచేసి, జవహర్రెడ్డి భూ అక్రమాలపై ఈసీ జోక్యం చేసుకోవాలి. నాలుగు రోజుల కిందట భోగాపురం విమానాశ్రయ పనుల సమీక్ష పేరుతో వచ్చిన సీఎస్.. అక్కడి ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఒత్తిడి చేశారు. పోలింగ్ అనంతర హింసపై రాష్ట్రంలో విచారణ జరుగుతుంటే, అవేవీ తనకు పట్టనట్లు విశాఖ వచ్చి ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పనుల పరిశీలన పేరుతో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సమీక్ష చేశారు’ అని మూర్తియాదవ్ ఆరోపణలు గుప్పించారు.
సీఎస్ కదలికలపై నిఘా పెట్టాలి
తెదేపా నేత వర్ల రామయ్య
ఈనాడు డిజిటల్, అమరావతి: విశాఖలో దళితులకు చెందిన 800 ఎకరాల ఎసైన్డ్ భూములను తన కుమారుడికి దోచిపెట్టేందుకు సీఎస్ జవహర్రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. సీఎస్ జవహర్రెడ్డి పాస్పోర్టును సీజ్ చేసి.. ఆయన కదలికలపై నిఘాపెట్టాలని శనివారం ఓ ప్రకటనలో ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటినుంచి భూ వ్యవహారాలు సహా ఆయన ఏ కీలక దస్త్రమూ చూడకుండా, విశాఖ అధికారుల్ని కలవకుండా సీఎస్ను నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ కేంద్రంగా ఆయన సాగిస్తున్న భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్రలోని 60% భూములు కడప వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయని వర్ల రామయ్య ఆరోపించారు. రాయలసీమ వాళ్లకు ఇక్కడేం పనని మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఒక సందర్భంలో ప్రశ్నించారని గుర్తుచేశారు. ‘‘సీఎం జగన్ కుటుంబం దళితులకు చెందిన వేల ఎకరాల భూములను దోచుకుంది. చంద్రబాబు సీఎం కాగానే జవహర్రెడ్డి వంటి భూ దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. వారు దోచుకున్న భూముల్ని పేదలకు పంచుతాం. ఈ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో జరిగిన భూ క్రయ, విక్రమాలపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం’’ అని వర్ల రామయ్య స్పష్టం చేశారు.
మూర్తియాదవ్ ఆరోపణల్లో నిజం లేదు: సీఎస్ జవహర్రెడ్డి
ఈనాడు, అమరావతి: విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో తాను, తన కుటుంబసభ్యులు, బంధువులు ఎలాంటి ఎసైన్డ్ భూములూ కొనలేదని సీఎస్ జవహర్రెడ్డి స్పష్టం చేశారు. తనపై జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ నిరాధారమైన ఆరోపణలు చేశారని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఏప్రిల్లో నా స్నేహితుడి కుమార్తె వివాహానికి ఎన్నికల కారణంగా హాజరు కాలేకపోయాను. రెండు రోజుల విశాఖ పర్యటనలో ఆదివారం వెళ్లి ఆ దంపతులను ఆశీర్వదించాను. సోమవారం భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలించాను. ఉత్తరాంధ్రలో రూ.2వేల కోట్ల విలువైన 800 ఎకరాల ఎసైన్డ్ భూములు కొట్టేసినట్లు మూర్తియాదవ్ నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఎసైన్డ్ భూముల చట్టసవరణకు అసెంబ్లీ 2023 అక్టోబరులో ఆమోదం తెలిపింది. దీన్ని అనుసరించి ఎసైన్డ్ భూములపై జీఓ 596ను రెవెన్యూశాఖ జారీచేసింది. ఉత్తరాంధ్రలో రూ.1,000 కోట్ల విలువైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఎసైన్డ్ భూములను నా కుమారుడ్ని అడ్డంపెట్టి బినామీల పేరుతో చేజిక్కించుకున్నట్లు ఆయన చేసిన ఆరోపణల్లో నిజం లేదు. నా కుమారుడు గత ఐదేళ్లలో విశాఖకే కాదు.. ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకూ వెళ్లలేదు. భూముల రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఆఘమేఘాలపై యంత్రాంగాన్ని పరుగులు పెట్టించి వారిపై ఒత్తిడి తెచ్చినట్లు కార్పొరేటర్ నిరాధారమైన ఆరోపణలు చేశారు. విమానాశ్రయం పనుల పరిశీలన పేరు చెప్పి జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్షించానని చేసిన ఆరోపణలు అవాస్తవం. తప్పుడు ఆరోపణలు చేసిన మూర్తియాదవ్ వాటిని వెనక్కి తీసుకుని మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలి. లేదంటే వ్యక్తిగతంగా పరువునష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని జవహర్రెడ్డి హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి