Amaravati: వైకాపాని ఓడిద్దాం.. అమరావతిని నిర్మిద్దాం: దళితబహుజన ఫ్రంట్‌, కాపునాడు

వైకాపాని ఓడిద్దాం.. అమరావతిని నిర్మిద్దామని దళిత బహుజన ఫ్రంట్‌, కాపునాడు నాయకులు పిలుపునిచ్చారు.

Published : 11 Apr 2024 20:43 IST

అమరావతి: వైకాపాని ఓడిద్దాం.. అమరావతిని నిర్మిద్దామని దళిత బహుజన ఫ్రంట్‌, కాపునాడు నాయకులు పిలుపునిచ్చారు. ఆ మేరకు విజయవాడలోని కాపునాడు కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. సీఎం జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదని దళిత బహుజన ఫ్రంట్‌ నాయకులు విమర్శించారు.

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలోని దళిత, బహుజనులకి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం దళితులు, బహుజనులకు ఇచ్చిన 27 పథకాలను జగన్‌ సర్కారు రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు నవరత్నాలకు మళ్లించడం అన్యాయమన్నారు. విదేశీ విద్యకి అంబేడ్కర్‌ పేరు తొలగించి జగన్‌ పేరు పెట్టుకోవడం ఏంటని దళిత బహుజన, కాపునాడు నేతలు ప్రశ్నించారు. హత్యలు చేసిన వారికి సైతం జగన్‌.. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని