Dharmapuri Arvind: ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పు: ఎంపీ ధర్మపురి అర్వింద్‌

వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమని భాజపా (BJP) ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) ప్రశ్నించారు.

Updated : 16 Apr 2024 14:02 IST

నిజామాబాద్: వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమని భాజపా (BJP) ఎంపీ ధర్మపురి అర్వింద్‌ (Dharmapuri Arvind) ప్రశ్నించారు. నిజామాబాద్‌లో ఇంటింటి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారతాయని చెప్పారు. రాష్ట్రంలోని అధికార పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని