Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్‌ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర

రాష్ట్ర నీటి హక్కుల ముసుగులో స్వార్థ ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సాగర్‌పై దండయాత్ర చేశారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) ఆరోపించారు.

Published : 02 Dec 2023 14:19 IST

మంగళగిరి: రాష్ట్ర నీటి హక్కుల ముసుగులో స్వార్థ ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా సాగర్‌పై దండయాత్ర చేశారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర (Dhulipalla Narendra) ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాజకీయ లబ్ధి కోసమే జగన్‌ నీటి చిచ్చు పెట్టారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోలీసులను జగన్‌ ఉసిగొలిపారు. డెల్టా రైతులు మొత్తుకున్నా సీఎం జగన్‌ నోరు మెదపలేదు. హఠాత్తుగా తెలంగాణ ఎన్నికల రోజు జగన్నాటకానికి తెరలేపారు.  తెలుగువారి మధ్య చిచ్చుపెట్టడమే జగన్‌ లక్ష్యమా? రాష్ట్ర సమస్యలపై నాలుగున్నరేళ్లుగా జగన్‌ ఎందుకు ప్రశ్నించలేదు? ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారు?’’ అని ధూళిపాళ్ల ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు