Tamil Nadu: తూత్తుకుడి స్థానంలో కనిమొళి, నీలగిరి నుంచి రాజా: అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే
తమిళనాడు(Tamil Nadu)లోని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్సభ ఎన్నికల నిమిత్తం తొలివిడత అభ్యర్థులను ప్రకటించాయి.
చెన్నై: సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్లపై పార్టీలు వరాలు జల్లు కురిపిస్తున్నాయి. అదే సమయంలో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తమిళనాడు(Tamil Nadu)లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే(DMK), అన్నాడీఎంకే(AIADMK) తమ అభ్యర్థులను ప్రకటించాయి.
డీఎంకే నేతల సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మేనిఫెస్టో విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షలపై నిషేధం వంటి వాగ్దానాలను అందులో ప్రస్తావించారు. అలాగే రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించామని చెప్పారు. ‘‘2014లో అధికారంలోకి వచ్చిన భాజపా పాలనలో దేశం వెనకబడింది. వారు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి. 2024లో మన కూటమి అధికారంలోకి వస్తుంది’’ అని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రధాని మోదీ చేస్తోన్న పర్యటనలపై స్పందిస్తూ.. ‘‘వరదల సమయంలో మోదీ పర్యటిస్తే సంతోషించేవాడిని’’ అని వ్యాఖ్యానించారు. 39 లోక్సభ స్థానాలకు గానూ 21 సీట్లకు డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన సీట్లను కూటమిలోని మిత్రపక్షాలకు కేటాయించే అవకాశాలున్నాయి. కీలక నేతలైన కనిమొళి, దయానిధి మారన్ను తూత్తుకుడి, చెన్నై సెంట్రల్ నుంచి బరిలో దింపింది. కేంద్రమాజీ మంత్రి ఏ రాజా.. నీలగిరి నుంచి పోటీ చేయనున్నారు.
మరోపక్క.. అన్నాడీఎంకే తొలివిడతలో 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈ జాబితా విడుదల చేశారు. ఏడు దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు తొలివిడత ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!