Lok Sabha Polls: ₹75కే లీటర్ పెట్రోల్.. ₹500కే గ్యాస్ సిలిండర్.. టోల్ బూత్లు ఎత్తేస్తాం: డీఎంకే హామీలు
దేశంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ విశ్వాసం వ్యక్తంచేశారు. తమ కూటమిని గెలిపిస్తే అమలు చేసే హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు.
చెన్నై: దేశాన్ని మోదీ (PM Modi) సర్కార్ నాశనం చేసిందని డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin) విమర్శించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) ‘ఇండియా’ కూటమి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం తమ పార్టీ తరఫున లోక్సభ బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘ఇండియా’ కూటమిని గెలిపిస్తే ప్రజలకు రూ.75 పెట్రోల్, రూ.65కే డీజిల్ అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. రైతులు, విద్యార్థులకు రుణమాఫీ చేయడంతో పాటు మహిళలందరికీ నెలకు రూ.1000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. జాతీయ రహదారులపై టోల్ బూత్లను పూర్తిగా ఎత్తివేస్తామన్నారు. జాతీయ విద్యావిధానం, నీట్ పరీక్ష, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లను తమిళనాడులో అమలుచేయబోమని హామీ ఇచ్చారు.
డీఎంకే మేనిఫెస్టోలో మరికొన్ని హామీలివే..
- ‘ఇండియా’ కూటమి గెలిస్తే నీతిఆయోగ్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థనలు స్వీకరించేందుకు మళ్లీ ప్రణాళికా సంఘం ఏర్పాటు
- జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు అక్కడ ఎన్నికలు జరుపుతాం.
- నూతన విద్యావిధానం 2020ని రద్దు చేస్తాం. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తాం.
- అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకొని దాని స్థానంలో భారత సాయుధ దళాల్లో శాశ్వత రిక్రూట్మెంట్ సర్వీస్ను తిరిగి ప్రవేశపెడతాం.
- ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించేందుకు వీలు కల్పించే ఆర్టికల్ 356ను తొలగించేందుకు డీఎంకే గట్టిగా కృషి చేస్తుంది.
- మహిళలకు పార్లమెంటు, అసెంబ్లీల్లో 33శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలుచేస్తాం.
- రాజ్యాంగ పీఠికలో పేర్కొన్నట్లు భారతదేశ లౌకిక స్వభావాన్ని కాపాడటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటాం.
- పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను రద్దు చేసి మైనార్టీలందరినీ వివక్ష లేకుండా సమానంగా పరిగణిస్తాం. ముస్లింలు, ఇతర మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సచార్ కమిటీ చేసిన సిఫారసులను అమలుచేస్తాం. తమిళనాడు తరహాలో దేశమంతా మైనార్టీలకు రిజర్వేషన్లు అమలుకు కృషిచేస్తాం.
- శ్రీలంక తమిళ శరణార్థులు భారత పౌరసత్వం పొందేలా వెసులుబాటు కల్పిస్తాం. శ్రీలంకకు తిరిగి వెళ్లాలనుకునే వారికి సహాయం అందిస్తాం.
- ఒకే దేశం -ఒకే ఎన్నికలు ప్రతిపాదనను విరమిస్తాం. రాష్ట్రాలకు లోక్సభ సీట్ల కేటాయింపు కోసం 1971 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుంది.
- గత పదేళ్లలో భాజపా సర్కారు ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే సమీక్షిస్తాం. కార్మిక వ్యతిరేక విధానాలను సంస్కరిస్తాం.
- ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ద్వారా కేంద్ర ప్రభుత్వం నెలకు కనీసం రూ.5,000 పెన్షన్ను అందజేసేలా చర్యలు తీసుకుంటాం.
- మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిదినాలు 100 నుంచి 150 రోజులకు పెంచుతాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.400లు చొప్పున వేతనం అందిస్తాం.
- ప్రజలతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్లను కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వర్సిటీలకు వీసీలను నియమించేలా సంబంధిత చట్టాలకు సవరణలు తీసుకొస్తాం.
- ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటంతో పాటు, సేతుసముద్రం ప్రాజెక్టును అమలుచేయడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నిషేధిత చట్టం, చెన్నైలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటు, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించడం, తమిళంతో సహా అన్ని రాష్ట్రాల భాషలకు సమానంగా నిధుల కేటాయింపు తదితర వాగ్దానాలు చేశారు.
మరోవైపు, తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉండగా ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న డీఎంకే 21 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా 18 సీట్లను కాంగ్రెస్, వామపక్షాలతో పాటు మిత్రపక్షాలకు కేటాయించింది. ఇందులో తొమ్మిది సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు