Eatala Rajender: మల్కాజిగిరి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నా: ఈటల
వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.
యాదగిరిగుట్ట: వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, భారాసకు ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మోదీ సర్కారుతోనే దేశ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో సమూలమార్పులు తీసుకువచ్చారని వివరించారు.
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే.. ఓడిపోయిన అభ్యర్థులతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అహంకారానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. అప్పుల కోసం సీఎం రేవంత్రెడ్డి కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం వస్తే పోటీకి సిద్ధమే. మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నా. అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తా’’ అని ఈటల వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.