Eatala Rajender: మల్కాజిగిరి విషయంలో వారి అలక టీ కప్పులో తుపాను: ఈటల

మల్కాజిగిరి టికెట్‌ ఆశించి భంగపడిన భాజపా నాయకుల అలకలు టీ కప్పులో తుపాన్‌ లాంటివని భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు.

Published : 03 Mar 2024 23:40 IST

లాల్‌బజార్‌: మల్కాజిగిరి టికెట్‌ ఆశించి భంగపడిన భాజపా నాయకుల అలకలు టీ కప్పులో తుపాన్‌ లాంటివని భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం రాత్రి లాల్‌బజార్‌లోని మహంకాళి ఆలయాన్ని ఆయన సందర్శించారు. దేవాలయానికి సంబంధించిన భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరగడం బాధకరమని పేర్కొన్నారు. స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని