Eatala Rajender: ఈసారి గజ్వేల్‌లోనూ అదే జరుగుతుంది: ఈటల రాజేందర్‌

గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యద్ధం లాంటివని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. గజ్వేల్లో పార్టీ కార్యకర్తలతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.

Updated : 26 Oct 2023 14:54 IST

గజ్వేల్‌ గ్రామీణం: గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు భారాసకు బుద్ధి చెబుతారన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా గజ్వేల్‌లో గెలిచేది భాజపానే అని ధీమా వ్యక్తం చేశారు. వర్గల్‌ సరస్వతీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పార్టీ కార్యకర్తలతో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారాసపై విమర్శలు గుప్పించారు.

ఈటల మాట్లాడుతూ.. ‘‘గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సరే మీటింగ్ పెట్టుకోవచ్చు. అయితే, భాజపా నిర్వహించే సమావేశాలకు రాకుండా ప్రజలను అడ్డుకుంటున్నారు. దావతులు ఇచ్చి, పైసలు పంచి రాకుండా ఆపేస్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలోనూ ఇదే తరహాలో చేశారు. కానీ అక్కడ ఈ ప్రలోభాలు, డబ్బు పంపకాలకు హుజూరాబాద్‌ ప్రజలు పాతరేసి ధర్మాన్ని, న్యాయాన్ని, ఉద్యమ బిడ్డను గెలిపించుకున్నారు. ఈసారి గజ్వేల్‌లో కూడా అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని, ధర్మాన్ని కాపాడాలని గజ్వేల్‌ ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని