EC: అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు

భాజపా లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ అనుచిత వ్యాఖ్యలుపై  స్పందిస్తూ ఎన్నికల సంఘం శుక్రవారం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Updated : 17 May 2024 19:59 IST

దిల్లీ: బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, భాజపా లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం (EC) శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మే 15న హల్దియాలో జరిగిన బహిరంగ సభలో అభిజిత్ గంగోపాధ్యాయ ప్రసంగిస్తూ బెంగాల్‌ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మే 25న పోలింగ్ జరగనున్న పశ్చిమబెంగాల్‌లోని తమ్లుక్ లోక్‌సభ స్థానం నుంచి గంగోపాధ్యాయ భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 

గంగోపాధ్యాయ వ్యాఖ్యలు అగౌరవ సూచికంగా ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలను ఆయన ఉల్లంఘించారని ఈసీ తన నోటీసులో పేర్కొంది. మే 20 సాయంత్రం 5 గంటలలోపు తన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని ఈసీ గంగోపాధ్యాయను కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని