AP News: బదిలీ వేటు పడిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో నియామకాలు చేపట్టిన ఈసీ

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఇటీవల పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. తాజాగా బదిలీ చేసిన స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టింది. 

Updated : 04 Apr 2024 16:50 IST

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న అంశంపై కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల ఈసీ బదిలీ వేటు వేసింది. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్‌, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, గుంటూరు రేంజ్‌ ఐజీ పాలరాజు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన అధికారులు ఈరోజు రాత్రి 8గంటల్లోగా ఛార్జ్‌ తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొత్తగా నియమితులైన ఉన్నతాధికారులు వీరే..

  • కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డి.కె.బాలాజీ
  • అనంతపురం కలెక్టర్‌గా వి.వినోద్‌కుమార్‌
  • తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్‌ కుమార్‌
  • గుంటూరు ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
  • ప్రకాశం ఎస్పీగా సుమిత్‌ సునీల్‌
  • పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్‌
  • చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు
  • అనంతపురం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌
  • నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్‌ హఫీజ్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని