Bandi Sanjay: బండి సంజయ్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

భాజపా ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి జరిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో చోటుచేసుకుంది.

Updated : 28 Feb 2024 14:06 IST

భీమదేవరపల్లి: భాజపా ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి జరిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో బుధవారం చోటుచేసుకుంది. ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్‌ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వంగరలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇంటిని సందర్శించారు. అనంతరం ముల్కనూర్‌ బయల్దేరుతుండగా ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసరడంతో అవి కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ కార్యకర్తలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో కోడిగుడ్లతో దాడి జరిగినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాకు భద్రత అక్కర్లేదు. పోలీసులు నాతో రావొద్దు. నా రక్షణ మా కార్యకర్తలే చూసుకుంటారు’’ అని మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని