ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌పై కేసు నమోదు చేశారా?లేదా?: ప్రజాప్రతినిధుల కోర్టు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

Published : 11 Aug 2023 15:38 IST

హైదరాబాద్‌: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. పిటిషన్‌పై విచారణ చేసిన న్యాయస్థానం.. శ్రీనివాస్‌గౌడ్‌, అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయాలని ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదని.. వారిపై మహబూబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేంద్ర రాజు మరోసారి కోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేశారా? లేదా? ఒకవేళ నమోదు చేసి ఉంటే ఎఫ్‌ఐఆర్‌ సహా పూర్తి వివరాలు ఇవాళ సాయంత్రంలోగా కోర్టుకు సమర్పించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ), పోలీసులను ఆదేశించింది. మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయకపోతే దాన్ని కోర్టు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు