Elections: ‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గట్టికౌంటర్ ఇచ్చారు.
భువనేశ్వర్: ఒడిశాలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్లో హీటుపుట్టించారు. ఒడిశాలో మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. పలువురు కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలపై బిజూ జనతాదళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం గట్టి కౌంటర్ ఇచ్చారు. వారిని పొలిటికల్ టూరిస్ట్లుగా పేర్కొన్న ఆయన.. ఒడిశాను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామంటూ చేసిన హామీలపై మండిపడ్డారు. ముందు మీ రాష్ట్రాల్లో పరిస్థితి చూసుకోండని సలహా ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్, హరియాణా, అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒడిశాలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై నవీన్ పట్నాయక్ ఓ వీడియో సందేశం ద్వారా స్పందించారు. ‘‘అస్సాం తలసరి అప్పు ఒడిశా కంటే రెట్టింపు ఉంది. మీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి. మీ మాటలకు ఒడిశా ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. వీరంతా పొలిటికల్ టూరిస్టులని, కేవలం ఎన్నికలప్పుడు వచ్చి తర్వాత అదృశ్యమవుతారని తెలిపారు. వారు చేసిన ప్రసంగాలు రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు.
తమ పార్టీ నాయకుల్ని పొలిటికల్ టూరిస్ట్లుగా పేర్కొనడంపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి, భాజపా అధ్యక్షుడు పొలిటికల్ టూరిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నవీన్ పట్నాయక్ ప్రచారానికి తనతో పాటు ఎవరినీ పెట్టుకోలేక.. తమిళనాడు నుంచి ఒక వ్యక్తిని నియమించుకున్నారని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మాజీ మంత్రి రాజీనామా..
వైకాపాకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్కు తన రాజీనామా లేఖను పంపారు -
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జులను భాజపా నియమించింది. -
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. -
విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నలకు ఘన స్వాగతం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. -
జగన్పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయండి: ఏపీ హోంమంత్రి అనిత
రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి జరగాలని సింహాద్రి అప్పన్న స్వామిని కోరుకున్నానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. -
హామీ మేరకు 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: హరీశ్రావు
కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. ఇప్పుడు ఒక మాట చెబుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు
Sasikala: తమిళనాడు రాజకీయాల్లోకి తన ప్రవేశం ప్రారంభమైందని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అన్నారు. అన్నాడీఎంకేను ఏకతాటిపైకి తీసుకొస్తానని ప్రకటించారు. -
తెదేపా స్పీకర్ అభ్యర్థిని నిలిపితే ‘ఇండియా’ మద్దతు!
లోక్సభ స్పీకర్ ఎన్నికలో తెదేపా తన అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీకి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. -
ప్రజాధనంతో జగన్ విలాస సౌధం
రుషికొండపై పర్యాటక రిసార్టును ధ్వంసం చేసి ప్రజాధనంతో జగన్ విలాసవంతమైన రాజమహల్ నిర్మించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇటువైపు ఎవరినీ అనుమతించలేదు. -
రిసార్ట్స్ భవనాల్లో ఫొటోలు తీసి పైత్యం ప్రదర్శించడమా: వైకాపా
‘‘రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే.. అవి ప్రైవేటు ఆస్తులు కావు. ఎవరి సొంతం కూడా కావు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భవనాల్ని నిర్మించారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం. -
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ను అధిష్ఠానం నియమించింది. తెలుగుదేశం పార్టీతో ఆయన కుటుంబానికి నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. -
తెదేపాకు, చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటా
వెనకబడిన వర్గాలకు చెందిన తనకు ఇన్నాళ్ల పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. -
పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్లు
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పోలీసులు రౌడీషీట్ తెరిచారు. వీరితోపాటు నియోజకవర్గ పరిధిలోని 150 మందిపై కేసులు నమోదుచేశారు. -
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేంద్ర పార్లమెంటు వ్యవహారాలమంత్రి కిరణ్ రిజిజు ఆదవారం దిల్లీలో భేటీ అయ్యారు. మరికొద్ది రోజుల్లో నూతన లోక్సభ తొలి సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
భాజపా, అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు: చిదంబరం
తమిళనాడులో 10న విక్రవందీ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో విమర్శల వేడి మొదలైంది. ఈ ఎన్నిక కోసం భాజపా, అన్నాడీఎంకే రహస్య పొత్తు పెట్టుకుని పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం ఆరోపించారు. -
‘నీట్’పై సమగ్ర విచారణ చేపట్టాలి
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నీట్పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. మోదీ సర్కార్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. -
విద్యుత్ వ్యవహారంపై విచారణ కమిషన్ అసంబద్ధం
ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుందని, విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ ఆ రాష్ట్ర మాజీ సీఎం రమణ్సింగ్కు ఏమైనా లంచం ఇచ్చారా? అనేది భాజపా నేతలు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
వైఎస్సార్ కుమార్తెగా గర్విస్తున్నా: షర్మిల
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె అయినందుకు తాను గర్విస్తున్నానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని ఉద్దేశిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. -
సీఎంఓ నిధులతో కొన్న ఫర్నిచర్ను ప్రభుత్వానికి జగన్ అప్పగించరా?
ప్రభుత్వ సొమ్ముతో మాజీ సీఎం జగన్కు తాడేపల్లి, లోటస్పాండ్లలో ఉన్న ప్యాలెస్ల కోసం కొన్న ఫర్నిచర్ను ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. -
తిరుమలలో ప్రతి పనికీ 10-15 శాతం కమీషన్లు
ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో పవిత్రమైన తిరుమలను ఆ పార్టీ నాయకులు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి ధ్వజమెత్తారు.