Congress: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ నాలుగో జాబితా

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ నాలుగో జాబితాను విడుదల చేసింది.

Published : 24 Mar 2024 00:04 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు మరో 46 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాంటి కేటాయింపులు లేవు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి, వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ రాయ్, సహారన్‌పుర్ నుంచి ఇమ్రాన్‌ మసూద్‌, కార్తీ చిదంబరం - శివగంగ, మాణికం ఠాగూర్‌ - విరుదునగర్‌, హరిద్వార్ నుంచి వీరేందర్ రావత్ పోటీ చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 184 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని