Priyanka Gandhi: హిమాచల్ ప్రజలు కాంగ్రెస్‌కు పూర్తి మద్దతిస్తారు: ప్రియాంక గాంధీ

హిమాచల్‌ ప్రజలు లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు.

Published : 07 Apr 2024 19:09 IST

సిమ్లా: హిమాచల్‌ ప్రజలు లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు  పూర్తి మద్దతిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవైపు అధికారం కోసం భాజపా డబ్బు, ఏజెన్సీలను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని, మరోవైపు సత్యం, ధైర్యం, ఓర్పుతో కాంగ్రెస్ ముందుకెళ్తోందని అన్నారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలనే సంకల్పంతో పార్టీ పని చేస్తోందని తెలిపారు.

“నేను హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలిశాను. వారి ఐక్యత, కృషి, ప్రజల పట్ల అంకితభావం చూసి గర్విస్తున్నాను.’’ అని ప్రియాంక ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. హిమాచల్‌లో ప్రజల ఆశయాలను కాపాడటంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారని మునుపు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, సీనియర్ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 1న లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు