Gautami: అన్నాడీఎంకేలో చేరిన సినీనటి గౌతమి

కొన్ని నెలల క్రితం భాజపాను వీడిన సినీనటి గౌతమి అన్నాడీఎంకేలో చేరారు.

Published : 14 Feb 2024 20:08 IST

చెన్నై: సినీనటి గౌతమి (Gautami) అన్నాడీఎంకే (AIADMK)లో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి (Palaniswami)ని కలిసి పార్టీ కండువా కప్పుకొన్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు భాజపా (BJP)లో పనిచేసిన గౌతమి గతేడాది అక్టోబర్‌లో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసినా.. తనకు కష్ట సమయంలో తగిన మద్దతు లభించకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు గౌతమి అప్పట్లో ఓ ప్రకటన చేశారు. ఈ పరిణామాల అనంతరం తాజాగా ఆమె చెన్నైలోని గ్రీన్‌వేస్‌ రోడ్డులో పళనిస్వామి నివాసానికి వెళ్లి అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో భాజపాలో పనిచేసిన తమిళ నటి గాయత్రి రఘురాం సైతం ఇటీవల అన్నాడీఎంకేలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని