మోదీ వల్ల బాగుపడింది అదానీ ఒక్కరే
దేశాన్ని భూతలస్వర్గంగా మారుస్తానని చెప్పిన ప్రధాని మోదీ.. అన్ని రకాలుగా ప్రజల్ని మోసగించారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వానిది దుర్మార్గపు పాలన
సెస్సులతో తోలు తీయడమేనా అభివృద్ధి?
అప్పులు, పన్నుల సొమ్ము ఏమైపోయిందో..
జమ్మికుంట బహిరంగసభలో మంత్రి కేటీఆర్
ఈనాడు - కరీంనగర్, వరంగల్, న్యూస్టుడే- జమ్మికుంట, కమలాపూర్: దేశాన్ని భూతలస్వర్గంగా మారుస్తానని చెప్పిన ప్రధాని మోదీ.. అన్ని రకాలుగా ప్రజల్ని మోసగించారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రం, హుజూరాబాద్ నియోజకవర్గంలో మంగళవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడుతూ మోదీది దుర్మార్గపు పాలన అని.. ఎన్నో మాయమాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన ఆయన చాంతాడంత హామీలు గుప్పించి.. ఏవీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. తనకు కుటుంబమే లేదని చెప్పిన ఆయనకు అదానీ రూపంలో పెద్ద కుటుంబం ఉందని, మోదీ ప్రాపకం వల్ల ఆయనొక్కరే బాగుపడ్డారని విమర్శించారు. మోదీ అదనపు సెస్సులతో పేద, మధ్యతరగతి ప్రజల తోలు తీసి రూ.30 లక్షల కోట్లు వసూలు చేయించారని.. ఇదేనా అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. టికెట్ ఇచ్చినందుకు బండి సంజయ్కి మోదీ దేవుడు కావచ్చు. పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఎందుకు దేవుడవుతారని ప్రశ్నించారు. రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడే ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. 14 మంది దేశ ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక్క మోదీ హయాంలోనే ఎనిమిదేళ్లలో రూ.100 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు..? ఆ పైసలన్నీ ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో వచ్చిన రూ.30 లక్షల కోట్లు ఏమైపోయాయో వివరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన అరిష్టమంటూ కొన్ని రోజుల కిందట ఈటల రాజేందర్ బాధ కలిగించేలా మాట్లాడారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. 33 మంది పోటీదారులను కాదని ఈటలకు ఆనాడు హుజూరాబాద్లో తెరాస అభ్యర్థిగా అవకాశమిస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు కేసీఆర్ పాలనను అరిష్టం అనొచ్చా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇస్తరాకుల మీటింగ్ ఏంటో?
మొన్న భాజపా వాళ్లు నిర్వహించిన ఇస్తరాకుల మీటింగేందని ఆరా తీస్తే అది విస్తారక్ల సమావేశం అని తెలిసిందని కేటీఆర్ హేళనగా అన్నారు. ప్రభారీలు, పాలక్లు.. పాలకూరలు, ఇస్తరాకులు లాంటి పేర్లున్న పార్టీ మనకెందుకని ప్రశ్నించారు. ‘మన తెలంగాణ పార్టీ పేరు మారింది. భారత్ రాష్ట్ర సమితిగా ఏర్పాటైంది. కానీ జెండా, ఎజెండా మారలేదు. పక్క రాష్ట్రాల్లో కూడా మన నాయకుడి దమ్ము చూపాలి’ అని అన్నారు.
ఎవరి పాలన అరిష్టమో ఆలోచించండి
‘రూ.700 పింఛను ఇచ్చే గుజరాత్ పాలన కావాలా? రూ.2016 ఇచ్చే కేసీఆర్ సర్కారు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి అని కేటీఆర్ అన్నారు. 66 లక్షల రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు రైతుబంధుగా వేసినందుకు కేసీఆర్ పాలన అరిష్టమా? 700 మంది రైతులను చంపిన మోదీ పాలన అరిష్టమా? ఆలోచించుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ సభలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీలు కౌశిక్రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు.. సోమవారం నుంచే కరీంనగర్ జిల్లాలో భాజపా, కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. జమ్మికుంట సభకు ఓ యువకుడు కమలం గుర్తు, ఈటల రాజేందర్ ఫొటో ఉన్న టీషర్టును ధరించి రావడంతో భారాస కార్యకర్తలు అతనిపై దాడి చేయబోయారు. వారిని పోలీసులు అడ్డుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పర్యటనలో నిరసనలు
* కరీంనగర్లో సర్క్యూట్ రెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేటీఆర్ను ఏబీవీపీ నాయకులు అడ్డుకోబోయారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ నినాదాలు చేసిన వారిని పోలీసులు ఠాణాకు తరలించారు.
* కమలాపూర్ సమీపంలోని గూడూరు కేజీబీవీ కెనాల్ దగ్గర పలువురు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని పక్కకు నెట్టేశారు. ఎన్ఎస్యూఐ, భారాస నాయకుల మధ్య తోపులాట, స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి.
విద్యార్థులతో కాసేపు సరదాగా..
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్ విద్యార్థులతో మమేకమయ్యారు. వారితో కలిసి భోజనం చేశారు. తొలుత రూ.49 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కరీంనగర్ నుంచి మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి కేటీఆర్ హెలికాప్టర్లో కమలాపూర్కు చేరుకున్నారు. అక్కడ అధికారులు, భారాస నేతలు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం గౌడ కమ్యూనిటీ హాల్, పాత్రికేయుల రెండు పడకగదుల ఇళ్లు, ఎస్సీ కమ్యూనిటీ హాల్, బస్టాండు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ‘కేసీఆర్ కుల సంఘాల భవన సముదాయం’ ప్రారంభించారు. అక్కడి నుంచి మహాత్మా జ్యోతిబా ఫులే (ఎంజేపీ) బాలికల పాఠశాల భవనం వద్దకు చేరుకున్న కేటీఆర్కు విద్యార్థులు మేళతాళాల మధ్య ఘనస్వాగతం పలికారు. అక్కడ ఎంజేపీ బాలికల పాఠశాల, బాలుర పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, డిజిటల్ తరగతి గదులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ముచ్చటించారు. డ్రోన్ల ఉపయోగాలను వారికి వివరించారు. పాఠశాలకు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్, వేన్నీళ్ల స్నానం చేసేందుకు గీజర్లు కావాలని విద్యార్థులు కోరగా.. ఆ ఏర్పాట్లన్నీ చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. దళిత బంధు లబ్ధిదారుల గాథలతో కరీంనగర్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రూపొందించిన పుస్తకాన్ని, సీడీని మంత్రి ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల