Kodali Nani: అలాంటివాళ్లు వెళ్లిపోతేనే పార్టీకి దరిద్రం వదులుతుంది: కొడాలి నాని
‘ఫోన్ ట్యాప్ చేసినవారిని దేశంలో ఎవరినైనా.. ఏమైనా చేయగలిగారా? ఒక్కటైనా నిర్ధారణ అయిందా?’ అని గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు.
అమరావతి: ‘ఫోన్ ట్యాప్ చేసినవారిని దేశంలో ఎవరినైనా.. ఏమైనా చేయగలిగారా? ఒక్కటైనా నిర్ధారణ అయిందా?’ అని గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. ‘‘ఇంటలిజెన్స్ అధిపతి, ఎమ్మెల్యేలం ప్రభుత్వంలో భాగం. నాకొచ్చిన సమాచారాన్ని ఆయన (ఇంటెలిజెన్స్ చీఫ్)కు కొన్ని వందలసార్లు పంపా. మా గురించిన సమాచారం ఆయనకొస్తే మాకూ పంపుతుంటారు.
అలాగే కోటంరెడ్డి బయట మాట్లాడింది ఆయన దృష్టికి వస్తే.. ‘ఇది జగన్ ప్రభుత్వం.. ఇలా మాట్లాడకండి.. ఇబ్బంది పడతారు’ అని పంపి ఉంటారు. అన్నీ ముఖ్యమంత్రే పిలిచి మాట్లాడతారా? రాష్ట్రంలో నాయకులందరి ఫోన్లను ట్యాప్ చేసి, ముఖ్యమంత్రి వింటూ కూర్చుంటారా?’’ అని ప్రశ్నించారు. కోటంరెడ్డి గురించి పరోక్షంగా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పనిచేయలేదనే కదా ఆయన్ను ప్రజలు ఓడించారు.. ఇప్పుడు ఆయన పార్టీలోకి చేరి నియోజకవర్గాలకు వీళ్లేం మంచి చేస్తారు? ఇలాంటివాళ్లు పోతేనే పార్టీకి దరిద్రం వదులుతుంది’ అని నాని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్