Nara Lokesh: తప్పుడు కేసులపై న్యాయవిచారణ తప్పదు
యువగళానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని.. సీబీఐని చూస్తే ముఖ్యమంత్రి జగన్లో రోజురోజుకూ ఇంకా భయం పెరుగుతోందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఒత్తిళ్లు ఉంటే వీఆర్కో, సెలవుపైనో వెళ్లండి
పోలీసులకు నారా లోకేశ్ సూచన
ఈనాడు డిజిటల్-చిత్తూరు, న్యూస్టుడే-ఐరాల, తవణంపల్లె: యువగళానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని.. సీబీఐని చూస్తే ముఖ్యమంత్రి జగన్లో రోజురోజుకూ ఇంకా భయం పెరుగుతోందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన 10 రోజులకే తనపై రెండు కేసులు పెట్టారని.. రానున్న 390 రోజుల్లో ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని సూచించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రకు మూడు షరతులతోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు ఇస్తే.. తన పాదయాత్రకు 29 షరతులు విధించారని ఆక్షేపించారు. యువగళానికి స్పందన లేదంటున్న హోంమంత్రి తానేటి వనిత.. యాత్రలో మూడు వాహనాలు, స్టూల్ను ఎందుకు సీజ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్కు ధైర్యం ఉంటే పరదాలు, బారికేడ్లు లేకుండా చిత్తూరు జిల్లాలో పర్యటించాలని.. తానూ ఇక్కడే తిరుగుతానని, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తేలిపోతుందన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా పదోరోజు ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా తవణంపల్లె, ఐరాల మండలాల్లో గాండ్ల, యువత, ముస్లిం, బీసీ వర్గాలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు స్థానికులతో మమేకమయ్యారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం పూతలపట్టు నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర.. చిత్తూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
మీ కుమార్తెలే విదేశాల్లో చదువుకోవాలా?
‘పలమనేరులో బహిరంగసభ నిర్వహించినందుకు అమరనాథరెడ్డిని ఏ1గా, నన్ను ఏ2గా కేసు పెట్టారు. నన్నే ఏ1గా చూపించి కేసులు నమోదుచేయండి. అక్రమకేసులు పెడుతున్న పోలీసులెవరినీ వదిలిపెట్టం. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో వీటిని ఎత్తేసి న్యాయవిచారణ చేయిస్తాం. చట్టాన్ని అనుసరించి బాధ్యులైన పోలీసులను సస్పెండో, డిస్మిసో చేస్తాం. మీపై అంతగా ఒత్తిళ్లు ఉంటే వీఆర్కో, సెలవుపైనో వెళ్లండి. పేదలూ విదేశాల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో మేం విదేశీ విద్యాదీవెన పథకం ప్రారంభించాం. ఏడాది తర్వాత ప్రభుత్వం మారడంతో మరుసటి సంవత్సరానికి విద్యార్థులకు ఫీజులు చెల్లించలేదు. మీ కుమార్తెలే విదేశాల్లో చదువుకోవాలా? పేదల పిల్లలకు ఆ సౌకర్యం ఉండకూడదా? ఇంజినీరింగ్ చేసినా ఉద్యోగం రాలేదని దర్శిలో కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. 31 మంది ఎంపీలున్నా ఏమీ చేయలేని ముఖ్యమంత్రిని ఎక్కడ ఉరేయాలి? ముస్లింలను వైకాపా అన్నిరకాలుగా మోసం చేసింది. శాసనమండలి ఛైర్మన్గా షరీఫ్ ఉన్నప్పుడు రాజధాని బిల్లులను హౌస్కమిటీకి పంపాలని మెజారిటీ సభ్యులు కోరినందుకు ఆయన్ను ఓ మంత్రి కొట్టారు’ అని లోకేశ్ ఆక్షేపించారు.
మైనర్లపైనా హత్యాయత్నం కేసులా?
యాదమరి మండలం చినరాయుడుపల్లికి చెందిన తమ కుటుంబాలు తెదేపాలో తిరగడాన్ని ఓర్చుకోలేక వైకాపా నాయకులు ఓ యువతితో ఫిర్యాదుచేయించి హత్యాయత్నం కేసు పెట్టించారని యువకులు ఇర్ఫత్ అలీ, అఫ్రోజ్, యాసిన్, నఫీజ్, మక్సూద్.. లోకేశ్ ఎదుట వాపోయారు. మైనర్లపైనా కేసులు పెట్టారని లోకేశ్ దృష్టికి తీసుకురాగా ఆయన ఆశ్చర్యపోయారు. మసీదు ఆక్రమణను అడ్డుకున్నందుకు తమను నమాజ్ చేసుకోనీయకుండా, మృతదేహాలను శ్మశానానికీ తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెట్టారని సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లపైనా కేసులు పెట్టడమేంటని లోకేశ్ ధ్వజమెత్తారు.
వేదిక ఏర్పాటుకు అనుమతి లేదంటూ..
తవణంపల్లె మండలం మారేడుపల్లిలో స్థానికులతో లోకేశ్ మాట్లాడేందుకు గ్రామస్థులు వేదిక ఏర్పాటుచేయగా అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. సొంత స్థలంలో వేదిక ఉందని తెలిపినా తొలగించాలని ఆదేశించారు. దీంతో స్థానికులే అక్కడున్న వేదికను తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
-
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్