Nara Lokesh: తప్పుడు కేసులపై న్యాయవిచారణ తప్పదు
యువగళానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని.. సీబీఐని చూస్తే ముఖ్యమంత్రి జగన్లో రోజురోజుకూ ఇంకా భయం పెరుగుతోందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఒత్తిళ్లు ఉంటే వీఆర్కో, సెలవుపైనో వెళ్లండి
పోలీసులకు నారా లోకేశ్ సూచన
ఈనాడు డిజిటల్-చిత్తూరు, న్యూస్టుడే-ఐరాల, తవణంపల్లె: యువగళానికి వస్తున్న ప్రజాదరణను చూస్తుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందని.. సీబీఐని చూస్తే ముఖ్యమంత్రి జగన్లో రోజురోజుకూ ఇంకా భయం పెరుగుతోందని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన 10 రోజులకే తనపై రెండు కేసులు పెట్టారని.. రానున్న 390 రోజుల్లో ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోవాలని సూచించారు. జగన్ ప్రజాసంకల్పయాత్రకు మూడు షరతులతోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు ఇస్తే.. తన పాదయాత్రకు 29 షరతులు విధించారని ఆక్షేపించారు. యువగళానికి స్పందన లేదంటున్న హోంమంత్రి తానేటి వనిత.. యాత్రలో మూడు వాహనాలు, స్టూల్ను ఎందుకు సీజ్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్కు ధైర్యం ఉంటే పరదాలు, బారికేడ్లు లేకుండా చిత్తూరు జిల్లాలో పర్యటించాలని.. తానూ ఇక్కడే తిరుగుతానని, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో తేలిపోతుందన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా పదోరోజు ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా తవణంపల్లె, ఐరాల మండలాల్లో గాండ్ల, యువత, ముస్లిం, బీసీ వర్గాలతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు స్థానికులతో మమేకమయ్యారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం పూతలపట్టు నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర.. చిత్తూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
మీ కుమార్తెలే విదేశాల్లో చదువుకోవాలా?
‘పలమనేరులో బహిరంగసభ నిర్వహించినందుకు అమరనాథరెడ్డిని ఏ1గా, నన్ను ఏ2గా కేసు పెట్టారు. నన్నే ఏ1గా చూపించి కేసులు నమోదుచేయండి. అక్రమకేసులు పెడుతున్న పోలీసులెవరినీ వదిలిపెట్టం. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో వీటిని ఎత్తేసి న్యాయవిచారణ చేయిస్తాం. చట్టాన్ని అనుసరించి బాధ్యులైన పోలీసులను సస్పెండో, డిస్మిసో చేస్తాం. మీపై అంతగా ఒత్తిళ్లు ఉంటే వీఆర్కో, సెలవుపైనో వెళ్లండి. పేదలూ విదేశాల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో మేం విదేశీ విద్యాదీవెన పథకం ప్రారంభించాం. ఏడాది తర్వాత ప్రభుత్వం మారడంతో మరుసటి సంవత్సరానికి విద్యార్థులకు ఫీజులు చెల్లించలేదు. మీ కుమార్తెలే విదేశాల్లో చదువుకోవాలా? పేదల పిల్లలకు ఆ సౌకర్యం ఉండకూడదా? ఇంజినీరింగ్ చేసినా ఉద్యోగం రాలేదని దర్శిలో కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. 31 మంది ఎంపీలున్నా ఏమీ చేయలేని ముఖ్యమంత్రిని ఎక్కడ ఉరేయాలి? ముస్లింలను వైకాపా అన్నిరకాలుగా మోసం చేసింది. శాసనమండలి ఛైర్మన్గా షరీఫ్ ఉన్నప్పుడు రాజధాని బిల్లులను హౌస్కమిటీకి పంపాలని మెజారిటీ సభ్యులు కోరినందుకు ఆయన్ను ఓ మంత్రి కొట్టారు’ అని లోకేశ్ ఆక్షేపించారు.
మైనర్లపైనా హత్యాయత్నం కేసులా?
యాదమరి మండలం చినరాయుడుపల్లికి చెందిన తమ కుటుంబాలు తెదేపాలో తిరగడాన్ని ఓర్చుకోలేక వైకాపా నాయకులు ఓ యువతితో ఫిర్యాదుచేయించి హత్యాయత్నం కేసు పెట్టించారని యువకులు ఇర్ఫత్ అలీ, అఫ్రోజ్, యాసిన్, నఫీజ్, మక్సూద్.. లోకేశ్ ఎదుట వాపోయారు. మైనర్లపైనా కేసులు పెట్టారని లోకేశ్ దృష్టికి తీసుకురాగా ఆయన ఆశ్చర్యపోయారు. మసీదు ఆక్రమణను అడ్డుకున్నందుకు తమను నమాజ్ చేసుకోనీయకుండా, మృతదేహాలను శ్మశానానికీ తీసుకెళ్లకుండా ఇబ్బందులు పెట్టారని సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లపైనా కేసులు పెట్టడమేంటని లోకేశ్ ధ్వజమెత్తారు.
వేదిక ఏర్పాటుకు అనుమతి లేదంటూ..
తవణంపల్లె మండలం మారేడుపల్లిలో స్థానికులతో లోకేశ్ మాట్లాడేందుకు గ్రామస్థులు వేదిక ఏర్పాటుచేయగా అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు. సొంత స్థలంలో వేదిక ఉందని తెలిపినా తొలగించాలని ఆదేశించారు. దీంతో స్థానికులే అక్కడున్న వేదికను తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ