అదానీకి మనం ఏమౌతాం ?
అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తన దాడిని విస్తృతం చేసింది. వివాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశ్శబ్దం పాటిస్తోందని ఆరోపించింది.
మోదీపై కాంగ్రెస్ ప్రశ్నల దాడి
దిల్లీ: అదానీ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తన దాడిని విస్తృతం చేసింది. వివాదంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశ్శబ్దం పాటిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో అదానీ మహా మెగా కుంభకోణం తమను ‘అదానీకి మనం ఏమౌతాం/హెచ్ఏహెచ్కే’? పేరిట ప్రధాని మోదీపై ప్రశ్నల పరంపరను సంధించేలా చేసిందని తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ రోజు నుంచి ప్రతి రోజూ ప్రశ్నలు వేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఆర్థిక అవకతవకలపై పనామా, పండోరా పత్రాల్లో ప్రాచుర్యంలోకి వచ్చిన గౌతం అదానీ సోదరుడైన వినోద్ అదానీకి చెందిన సంస్థకు సంబంధించిన వాస్తవ విషయాలు ఏమిటి? అదానీ గ్రూప్పై సంవత్సరాల క్రితం వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రధానమంత్రి పర్యవేక్షణలో న్యాయమైన, నిష్పాక్షికమైన దర్యాప్తును ఆశించవచ్చా? దేశంలోని భారీ పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన ఓ సంస్థను విమానాశ్రయాలు, నౌకాశ్రయాల నిర్మాణాల్లో గుత్తాధిపత్యం ఎలా కట్టబెట్టారు? ఆ సంస్థపై వచ్చిన ఆరోపణలు తీక్షణ పరిశీలన నుంచి తప్పించుకున్నాయా?’’ అని రమేశ్ నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!