ప్రజాధనం ఆవిరైనా పట్టించుకోని ప్రధాని అవసరమా?
పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధానమంత్రి మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
మోదీకి పారిశ్రామికవేత్తలపైనే ఎక్కువ మక్కువ
ఎమ్మెల్సీ కవిత విమర్శలు
ఈనాడు, హైదరాబాద్: పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధానమంత్రి మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోదీకి ప్రజలంటే పట్టింపు లేదనీ, తన మిత్రులైన పారిశ్రామికవేత్తలపైనే మక్కువ ఎక్కువనే విషయం ప్రధానమంత్రి ప్రసంగంలో తేటతెల్లమైందని విమర్శించారు. హైదరాబాద్లోని తన నివాసంలో బుధవారం కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ఆయన, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
నిండు సభలో ప్రధాని అబద్ధాలు
‘‘అదానీ గ్రూప్లో ఎల్ఐసీ రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఎస్బీఐ రూ.27 వేల కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.5,380 కోట్లు.. ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయి. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51% పడిపోగా, ఎల్ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. మొదటి ఏడాది 11.84 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇచ్చి... తర్వాత నుంచి తగ్గించుకుంటూ వచ్చింది. ఈ ఏడాది 3.87 కోట్ల మందికి మాత్రమే ఇచ్చింది. జగిత్యాల జిల్లా నుంచి అకారణంగా 50 వేల మంది రైతులను, నిజామాబాద్ నుంచి 60 వేల మంది రైతులను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించారు. కానీ ప్రధాని మోదీ బుధవారం నాటి పార్లమెంటు ప్రసంగంలో.. ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు చేశామని నిండు సభలో అబద్ధాలు చెప్పారు’’ అని కవిత ఆరోపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!