Yamini Sharma: కోటి మంది మహిళా లబ్ధిదారులతో సెల్ఫీ: సాధినేని యామిని శర్మ

గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన గృహిణుల నుంచి మహిళా వ్యాపారవేత్తల వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన మహిళలను అనుసంధానం చేస్తూ కోటి మంది లబ్ధిదారులతో సెల్ఫీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భాజపా మహిళా మోర్చా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి సాధినేని యామిని శర్మ పేర్కొన్నారు.

Updated : 15 Feb 2024 16:23 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన గృహిణుల నుంచి మహిళా వ్యాపారవేత్తల వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన మహిళలను అనుసంధానం చేస్తూ కోటి మంది లబ్ధిదారులతో సెల్ఫీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భాజపా మహిళా మోర్చా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి సాధినేని యామిని శర్మ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే బాలింతలు, గర్భిణీలు, ఆయుష్మాన్‌ భారత్‌, ఉజ్వల, జల్‌జీవన్‌ మిషన్‌, జన్‌ ధన్‌ యోజన, సౌభాగ్య యోజన, సుకన్య సమృద్ధి యోజన, తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సెల్ఫీ తీసుకుని మోదీ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో కేంద్ర పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వ అసలు ముసుగు తొలగిపోతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని