అదానీ, అంబానీల కోసమే మోదీ
ప్రతిపక్షాలను బలహీనపరిచే కుట్రకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెరలేపిందనీ, అందులో భాగంగానే కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారాట్ ధ్వజమెత్తారు.
తెలంగాణలో భాజపా కుట్రల్ని లౌకిక శక్తులు తిప్పికొట్టాలి
సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారాట్ పిలుపు
హిమాయత్నగర్ న్యూస్టుడే: ప్రతిపక్షాలను బలహీనపరిచే కుట్రకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తెరలేపిందనీ, అందులో భాగంగానే కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారాట్ ధ్వజమెత్తారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 17న వరంగల్లో ప్రారంభమైన జనచైతన్య యాత్ర బుధవారం హైదరాబాద్లో ముగిసింది. ఇందిరాపార్కు ధర్నాచౌక్లో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాశ్కారాట్ మాట్లాడుతూ... ‘‘ఒకవైపు దేశ ప్రజల మధ్య మత చిచ్చురేపుతూ, మరోవైపు ప్రకృతి వనరులను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరముంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వరంగ సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి దేశాన్ని లూఠీ చేశారు. ధరల పెరుగుదలతో పేదల జీవన ప్రమాణాలు దిగజారుతున్నా పట్టించుకోవడంలేదు. ప్రతిపక్షాలులేని భారత్గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ... భారాస నేత కవితను, ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ను విచారిస్తోంది. దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను అరెస్టు చేసింది.
భాజపాని నిలువరించాల్సిందే
తెలంగాణపై భాజపా కన్నేసింది. డబ్బు, పదవుల ఆశచూపించి అధికారంలోకి రావాలని చూస్తోంది. అదే జరిగితే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు నాశనం అవుతాయి. వామపక్ష, ప్రజాతంత్ర లౌకికశక్తులు ఏకమై అధికారంలోకి రాకుండా భాజపాను నిలువరించాలి.
అదానీ ఆస్తులు అంతగా ఎలా పెరిగాయి?
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అదానీ ఆస్తులు రూ.50వేల కోట్లు ఉండేవి. మోదీ ప్రధాని అయ్యాక రూ.10.3 లక్షల కోట్లకు పెరిగాయి. కేంద్రం మద్దతు ఉండటంతోనే ప్రపంచ కుభేరుల జాబితాలో 609స్థానం నుంచి అదానీ రెండో స్థానానికి ఎదిగారు’ అని ఆరోపించారు.
చావైనా, బతుకైనా సీపీఐతో కలిసే నడుస్తాం
‘రాష్ట్రంలో రానున్న కాలంలో చావైనా బతుకైనా కలిసే నడవాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈమేరకు రెండు పార్టీల సంయుక్త సమావేశాన్ని ఏప్రిల్ 9న నిర్వహిస్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సభలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, సీపీఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, జాన్వెస్లీ, సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే