ఒకే వేదికపైకి 21 ప్రతిపక్షాలు
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి రావాలన్న భావన ప్రతిపక్షాల నుంచి వెలువడుతున్న నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అందుకు రంగం సిద్ధం చేశారు.
సామాజిక న్యాయం పేరిట డీఎంకే సదస్సు
3న దిల్లీలో నిర్వహణ
ఈనాడు, దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు భాజపా వ్యతిరేక పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి రావాలన్న భావన ప్రతిపక్షాల నుంచి వెలువడుతున్న నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ అందుకు రంగం సిద్ధం చేశారు. ‘ప్రతి ఒక్కరికీ ప్రతిదీ (ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీవన్)’ నినాదంతో భావ సారూప్యం గల రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, సంస్థలు, పౌరసంఘాలను ఇందుకు ఆహ్వానించారు. సామాజిక న్యాయం పేరిట ఈ నెల 3న దిల్లీలోని న్యూమహారాష్ట్ర సదన్లో నిర్వహించే కార్యక్రమానికి మొత్తం 21 రాజకీయ పార్టీలు హాజరుకానున్నాయి. ఈ సదస్సును ఉద్దేశించి ఎం.కె.స్టాలిన్ ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (కాంగ్రెస్), ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (జేఎంఎం), బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా(సీపీఐ), అఖిలేశ్ యాదవ్(సమాజ్వాదీ పార్టీ), ఫరూఖ్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), డెరెక్ ఒబ్రియెన్ (టీఎంసీ), చగన్ భుజబల్ (ఎన్సీపీ), సంజయ్సింగ్ (ఆప్) గౌరవ అతిథులుగా పాల్గొని ప్రత్యేక ఉపన్యాసం చేయనున్నారు. మనోజ్ కుమార్ ఝా(ఆర్జేడీ), మహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), కె.కేశవరావు(భారాస) పాల్గొని ప్రసంగిస్తారు. మహారాష్ట్ర ఎమ్మెల్సీ మహదేవ్ జాన్కర్ (రాష్ట్ర్రీయ సమాజ్పక్ష్), నబ కుమార్సరనియా(అస్సాం గణ సురక్ష పార్టీ), రాజ్కుమార్సైనీ(లోక్తంత్ర సురక్షపార్టీ-హరియాణా) సదస్సుకు హాజరవుతారు. తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్(డీఎంకే), ఎంపీ వైకో (ఎండీఎంకే), విడుదలై చిరుత్తైగల్ కచ్చి లోక్సభ సభ్యుడు తిరుమావలవన్, ఎంఎంకె ఎమ్మెల్యే జవహిరుల్లా, కొంగునాడు మక్కల్ దేశీయకచ్చి ఎమ్మెల్యే ఈశ్వరన్లు సదస్సులో పాలుపంచుకుంటారు. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య ప్రారంభోపన్యాసం, అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్రసింగ్ యాదవ్ ముగింపు ఉపన్యాసం చేస్తారు. దిల్లీ వర్శిటీ ప్రొఫెసర్లు లక్ష్మణ్యాదవ్, సూరజ్ మండల్, రతన్లాల్లూ ఇందులో పాలుపంచుకుంటారు.
ఆహ్వానితుల జాబితాలో లేని పార్టీలు
ఇప్పటి వరకు జారీచేసిన అతిథుల జాబితాలో భాజపాయేతర పార్టీలైన బీఎస్పీ, జేడీయూ, వైకాపా, తెదేపా, బీజేడీ, శివసేన, జేడీఎస్, శిరోమణి అకాళీదళ్, ఆర్ఎల్డీ, ఎంఐఎం, అస్సాం గణపరిషత్, పీడీపీ పేర్లు లేవు. ఈ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక