Dharmana: మనకే ఓటేస్తారని దేవునిపై ఒట్టేయించండి!: మంత్రి ధర్మాన
‘రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు వైకాపాకే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని చిత్రపటంపై వారితో ఒట్టు వేయించండి’ అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లకు సూచించారు.
అరసవల్లి, న్యూస్టుడే: ‘రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తారనే నమ్మకం ఉండి.. వారు వైకాపాకే ఓటేస్తామని చెబితే వెంటనే దేవుని చిత్రపటంపై వారితో ఒట్టు వేయించండి’ అని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లకు సూచించారు. శ్రీకాకుళం టౌన్హాల్లో సోమవారం రాత్రి వాలంటీర్లతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది గుర్తించాలి. ఇందుకు మూడు పద్ధతులు అనుసరించాలి. ఏ, బీ, సీలుగా విభజించి.. ఏలో వైకాపాకు వేసేవారిని, బీలో వైకాపాకు ఓటు వేయనివారిని, సీలో గోడమీద పిల్లిలాంటి వారిని గుర్తించాలి. తెదేపాకు ఓటువేసే ఒక్క కుటుంబాన్ని వైకాపా వైపు వాలంటీర్లు తిప్పగలిగితే వేలల్లో ఓట్లు మనకు పడతాయి.
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు వస్తే పథకాలు ఇవ్వరనే బలహీనతపై కొట్టాలి. దూరప్రాంతాలకు వెళ్లిపోయిన వైకాపా ఓటర్లను గుర్తించి వారి చిరునామాలు సేకరించాలి. ఎవరైనా వినకపోతే కుటుంబపెద్దలను కలిసి మాట్లాడాలి. కొందరు కులపెద్దల మాట వింటారు. అలాంటివారిని గుర్తించి కులపెద్దలతో మాట్లాడాలి. ఓట్ల సేకరణకు తుపాకీ పట్టిన సైనికుడిలా యుద్ధానికి సిద్ధం కావాలి. మాకంటే వాలంటీర్లకే ఓటర్లలో మంచిపేరుంది. వైకాపా ఓడిపోతే వాలంటీర్ ఉద్యోగం పోతుంది’ అని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. యువజన నాయకుడు ధర్మాన రామ్మనోహర్నాయుడు మాట్లాడుతూ ‘ప్రజలు నాయకుల పేర్లు మరచిపోయారు. వాలంటీర్ల పేర్లే గుర్తుంచుకున్నారు. మనమంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. వాలంటీర్లు వైకాపా కోసం కష్టపడి పనిచేయాలి. ఉద్యోగం ఇష్టం లేకపోతే మానేయాలి’ అని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి 60 మంది వాలంటీర్లు గైర్హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్