మీ ఆరోపణలు అసత్యాల పుట్టలు
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భాజపా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
మోదీ హయాంలో దేశ సర్వతోముఖాభివృద్ధి
కాంగ్రెస్పై భాజపా ఎదురుదాడి
దిల్లీ: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భాజపా పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టింది. హస్తంపార్టీ సంధించిన ప్రశ్నలను నయ వంచనతో కూడిన అసత్యాల పుట్టగా అభివర్ణించింది. ప్రధాని మోదీపై ఉన్న విద్వేషం నుంచే అవి ఉద్భవించాయని పేర్కొంది. ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చే సమయానికి బలహీనంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈ తొమ్మిదేళ్లలో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు.
భాజపా స్పందన ఇదీ..
* 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం లక్ష కోట్ల అమెరికా డాలర్లు మాత్రమే. ఇప్పుడు 3.5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరింది. విదేశీ కరెన్సీ నిల్వలు రూ.50లక్షల కోట్లకు పెరిగాయి. ఎగుమతులు రెండు రెట్లు అధికమై రూ.36లక్షల కోట్లకు చేరువయ్యాయి.
* మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7శాతంగా ఉంది. ఇదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం 8.9శాతం, ఫ్రాన్స్లో 17.5శాతం, జర్మనీలో 23.5 శాతంగా ఉంది.
* మోదీ ప్రభుత్వం 312 పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.6.68లక్షల కోట్లను నేరుగా బదిలీ చేసింది. దీనివల్ల రూ.2.7లక్షల కోట్లు మధ్యవర్తుల చేతుల్లో పడకుండా ఆదా చేయగలిగింది.
* మోదీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తోంది.
* కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే చైనా మన భూభాగాలను ఆక్రమించింది. ఇటీవల తూర్పు లద్దాఖ్లో చైనా దురాక్రమణ యత్నాలను మన సైన్యం ధైర్యంగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ హయాంలో మన సరిహద్దుల వద్ద సరైన మౌలిక వసతులు లేవు. మోదీ ప్రభుత్వం సరిహద్దులను బలోపేతం చేస్తోంది.
* మోదీపై విద్వేషం వెదజల్లడాన్ని కాంగ్రెస్ మానుకోవాలి. ఇప్పటికే రెండు సార్లు లోక్సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాజయం తప్పదు.
* కొవిడ్ సమయంలో మోదీ ప్రభుత్వం సరిగా స్పందించలేదనడం దారుణం. మన దేశం తీసుకున్న చర్యలను ప్రపంచం యావత్తు గుర్తించింది. ప్రశంసించింది.
* 2014లో మన దేశ అవసరాలు తీర్చుకోవడం కోసం 78 శాతం సెల్ఫోన్లు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 99శాతం మొబైల్ ఫోన్లు దేశీయంగానే తయారవుతున్నాయి.
* కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలన కొనసాగిన 2004-14లో ప్రతి రంగంలోనూ భారీ అవినీతి చోటుచేసుకుంది. అటువంటి పార్టీ మోదీ పాలనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని రవి శంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు