Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
ఉత్తరాదిలో కీలకమైన రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య నెలకొన్న స్పర్థలను తొలగించి జోడు గుర్రాలతో శాసనసభ ఎన్నికలకు వెళ్లాలన్న అధిష్ఠానం ప్రయత్నాలు ఫలించేనా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి.
అధిష్ఠానం మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో!
దిల్లీ: ఉత్తరాదిలో కీలకమైన రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య నెలకొన్న స్పర్థలను తొలగించి జోడు గుర్రాలతో శాసనసభ ఎన్నికలకు వెళ్లాలన్న అధిష్ఠానం ప్రయత్నాలు ఫలించేనా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. అధిష్ఠానం ఈ ఇద్దరు నేతల్ని సోమవారం దిల్లీకి పిలిపించి మాట్లాడి, చేతులు కలిపేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను లోతుగా చూసినవారు మాత్రం అవి పైపై మాటలే తప్పిస్తే గుండెలోతుల్లోంచి వచ్చినవి కావని భావిస్తున్నారు. అన్ని అంశాలనూ హైకమాండ్కే వదిలేశారని పార్టీ నాయకత్వం ప్రకటించగా.. గహ్లోత్తో విభేదించడానికి ఉన్న కీలక అంశాలు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయని పైలట్ సన్నిహితులు చెబుతున్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ తొలుత గహ్లోత్తో రెండుగంటలు భేటీ అయ్యారు. తర్వాత పైలట్తో విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత అందరూ బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. పేరుకు ఒకేఇంట్లో జరిగిన సమావేశమే అయినా ఇద్దరితో అధిష్ఠానం దాదాపు విడివిడిగానే మాట్లాడిందని చెప్పాలి. విలేకరులు ప్రశ్నించినప్పుడు వారిద్దరూ కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ మాట్లాడారు. సామరస్యత కుదిరందన్న సంకేతాలు ఇద్దరు కీలక నేతల హావభావాల్లో ఏమాత్రం కనిపించలేదు.
మూడు డిమాండ్లపై పైలట్ పట్టు
వసుంధర రాజె ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై చర్యలు, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునర్వ్యవస్థీకరణ, పేపర్లీక్ల వల్ల పరీక్షలు రద్దయి ఇబ్బందులు పడినవారికి పరిహారం చెల్లించడం.. ఈ మూడు డిమాండ్లపై ఏమాత్రం వెనక్కి తగ్గరాదని పైలట్ కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాను వాటిపై గళమెత్తుతూనే ఉంటానని ఆయన తెగేసి చెబుతున్నారు. అటు గహ్లోత్ చూస్తే.. ఎవరి డిమాండ్లకూ పార్టీ తలొగ్గబోదనీ, అలాంటి పరిస్థితే కాంగ్రెస్లో రాదని కరాఖండీగా ప్రకటిస్తున్నారు. 2018లో రాజస్థాన్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఆ తిరుగుబాటు చర్యలతోనే పైలట్ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. నాయకత్వాన్ని మార్చాలని గత ఏడాది కూడా అధిష్ఠానం ప్రయత్నించింది. శాసనసభాపక్ష సమావేశ నిర్వహణకే గహ్లోత్ విధేయులు అనుమతించకపోవడంతో అది వీలుపడలేదు.
సహనంతో ఉండాలి
గహ్లోత్
తాను, సచిన్ కలిసి పనిచేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేరుస్తామని గహ్లోత్ ప్రకటించారు. ఒక హోదాలో సేవలందించడానికి సహనంతో వేచి ఉండాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు నర్మగర్భంగా సూచించారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది అధిష్ఠానం చూసుకుంటుందని, మూడుసార్లు సీఎంగా, మరో మూడుసార్లు కేంద్ర మంత్రిగా చేసినందువల్ల తనకు పదవులు ముఖ్యం కాదని మంగళవారం దిల్లీలో స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ భారాసలో చేరారు. -
TDP: ‘ప్రజాగళం’ పేరుతో మరిన్ని సభలు.. తెదేపా నిర్ణయం
తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. -
Prathipati Pulla rao: సభ విఫలం చేయాలని కుట్రలు చేశారు: ప్రత్తిపాటి
బొప్పూడిలో జరిగిన ‘ప్రజాగళం’ ఎన్డీయే కూటమి సభ అంచనాలకు మించి విజయవంతమైందని మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేశారు. -
PM Modi: వారి సవాల్ను స్వీకరిస్తున్నా.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్
PM Modi: ‘శక్తి’ని నిర్వీర్యం చేస్తామంటూ విపక్ష కూటమి తమ మేనిఫెస్టోలో చెబుతోందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. శక్తిని ఆరాధించేవారికి, నాశనం చేయాలనుకునేవారి మధ్యే ఈ పోరాటం అని అన్నారు. -
Nadendla Manohar: బొప్పూడి సభలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల మనోహర్
బొప్పూడిలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. -
BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కలిసిన భారాస నేతలు
కాంగ్రెస్లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ను కలిసింది. -
Atchannaidu: ప్రభుత్వ వెబ్సైట్లలో జగన్ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు
ప్రభుత్వ శాఖల వైబ్సైట్లలో సీఎం జగన్, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. -
AP Congress: ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా.. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల..?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. -
PM Modi: భారాస తెలంగాణను దోచుకుంది.. కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది: జగిత్యాల సభలో మోదీ
ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. -
Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు: నారా లోకేశ్
వైకాపా హయాంలో ఆగిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. -
ప్రధాని పర్యటనలో పోలీసుల తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్న కూటమి నేతలు
ప్రజాగళం సభకు పోలీసులు అడుగడుగునా అనేక అవరోధాలు సృష్టించడం, ప్రధాని మోదీ పాల్గొంటున్న సభ అయినా బేఖాతరుగా వ్యవహరించడం, సహాయనిరాకరణ వంటివన్నీ సభను విఫలం చేసేందుకు పన్నిన కుట్రలో భాగమని తెదేపా, జనసేన, భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
Gudivada Amarnath: గాజువాకలో అమర్నాథ్కు ఝలక్
విశాఖ జిల్లా గాజువాక వైకాపా అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న మంత్రి అమర్నాథ్కు పార్టీశ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం ఆయన గాజువాకలో తొలిసారిగా పార్టీశ్రేణులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. -
జగన్ సీఎం కాదు.. సారా వ్యాపారి
తిరుపతి బాలాజీ ఆశీస్సులతో 2014లో ఎన్డీయే విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024లో దుర్గమ్మ ఆశీస్సులతో మళ్లీ మొదలుపెడుతున్నాం. అంతకుమించిన ఘన విజయాన్ని సాధిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. -
జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే
‘వికసిత భారత్ కోసం ఇదే సమయం. సరైన సమయం’ అనేది నరేంద్రమోదీ నినాదం. దేశానికి సరైన సమయంలో మోదీ లాంటి సరైన నాయకుడు దొరికారు. ఆ దిశగా మీ ప్రతి ప్రయత్నంలో మేము మీతో ఉంటామని మాటిస్తున్నాం. -
‘ప్రజాగళం’ సభలో ఎవరేమన్నారంటే..
అయిదేళ్లుగా సీఎం జగన్ మీద, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలుసు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. 56 రోజుల కౌంట్డౌన్ మొదలైంది. తెదేపా, జనసేన, భాజపా కూటమికి అధికారాన్ని కట్టబెట్టాలని ప్రజలు చూస్తున్నారు. -
జగన్ మీ దత్తపుత్రుడు కాదా?
ముఖ్యమంత్రి జగన్తో అయిదేళ్లుగా అంట కాగుతూ కాంగ్రెస్ వైకాపా ఒకటేనని ప్రధాన మోదీ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. -
అన్ని స్థానాలకు పోటీ చేస్తాం
బహుజనులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించి రాజ్యాధికారంలో వారిని భాగస్వాములను చేసే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.పరంజ్యోతి తెలిపారు. -
అగమ్యగోచరంగా భారాస పరిస్థితి: మల్లురవి
భారాస లక్క ఇల్లు లాంటిదని, ఓటమి మంటల్లో చిక్కుకొని కాలిపోతుండడంతో ఆ పార్టీ నాయకులు బయటపడుతున్నారని దిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి అన్నారు. -
మిగతా అభ్యర్థుల ఖరారుకు కాంగ్రెస్ కసరత్తు
లోక్సభ ఎన్నికల్లో ఇంకా ప్రకటించాల్సిన అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ (సీఈసీ) మంగళ, బుధవారాల్లో సమావేశమయ్యే అవకాశం ఉంది. -
దానంపై ఫిర్యాదుకు స్పీకర్ ఇంటికి భారాస ఎమ్మెల్యేలు..
భారాస పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వినతిపత్రం అందజేయాలని భారాస ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
తాజా వార్తలు (Latest News)
-
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే
-
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన
-
Viral Video: సర్కస్లో స్టంట్.. పట్టుతప్పి 12 అడుగుల ఎత్తు నుంచి జారిపడిన యువతి
-
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ
-
Sadananda: కాంగ్రెస్లోకి సదానంద గౌడ..? మనసులో మాట చెబుతానన్న మాజీ సీఎం