Congress: చేతులేనా.. చేతల్లోనూనా!: గహ్లోత్, పైలట్ మధ్య సయోధ్యపై సందేహాలు
ఉత్తరాదిలో కీలకమైన రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య నెలకొన్న స్పర్థలను తొలగించి జోడు గుర్రాలతో శాసనసభ ఎన్నికలకు వెళ్లాలన్న అధిష్ఠానం ప్రయత్నాలు ఫలించేనా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి.
అధిష్ఠానం మంత్రం ఎంతవరకు ఫలిస్తుందో!
దిల్లీ: ఉత్తరాదిలో కీలకమైన రాజస్థాన్లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య నెలకొన్న స్పర్థలను తొలగించి జోడు గుర్రాలతో శాసనసభ ఎన్నికలకు వెళ్లాలన్న అధిష్ఠానం ప్రయత్నాలు ఫలించేనా అనే సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. అధిష్ఠానం ఈ ఇద్దరు నేతల్ని సోమవారం దిల్లీకి పిలిపించి మాట్లాడి, చేతులు కలిపేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను లోతుగా చూసినవారు మాత్రం అవి పైపై మాటలే తప్పిస్తే గుండెలోతుల్లోంచి వచ్చినవి కావని భావిస్తున్నారు. అన్ని అంశాలనూ హైకమాండ్కే వదిలేశారని పార్టీ నాయకత్వం ప్రకటించగా.. గహ్లోత్తో విభేదించడానికి ఉన్న కీలక అంశాలు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయని పైలట్ సన్నిహితులు చెబుతున్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ తొలుత గహ్లోత్తో రెండుగంటలు భేటీ అయ్యారు. తర్వాత పైలట్తో విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత అందరూ బయటకు వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. పేరుకు ఒకేఇంట్లో జరిగిన సమావేశమే అయినా ఇద్దరితో అధిష్ఠానం దాదాపు విడివిడిగానే మాట్లాడిందని చెప్పాలి. విలేకరులు ప్రశ్నించినప్పుడు వారిద్దరూ కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ మాట్లాడారు. సామరస్యత కుదిరందన్న సంకేతాలు ఇద్దరు కీలక నేతల హావభావాల్లో ఏమాత్రం కనిపించలేదు.
మూడు డిమాండ్లపై పైలట్ పట్టు
వసుంధర రాజె ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై చర్యలు, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునర్వ్యవస్థీకరణ, పేపర్లీక్ల వల్ల పరీక్షలు రద్దయి ఇబ్బందులు పడినవారికి పరిహారం చెల్లించడం.. ఈ మూడు డిమాండ్లపై ఏమాత్రం వెనక్కి తగ్గరాదని పైలట్ కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాను వాటిపై గళమెత్తుతూనే ఉంటానని ఆయన తెగేసి చెబుతున్నారు. అటు గహ్లోత్ చూస్తే.. ఎవరి డిమాండ్లకూ పార్టీ తలొగ్గబోదనీ, అలాంటి పరిస్థితే కాంగ్రెస్లో రాదని కరాఖండీగా ప్రకటిస్తున్నారు. 2018లో రాజస్థాన్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఆ తిరుగుబాటు చర్యలతోనే పైలట్ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. నాయకత్వాన్ని మార్చాలని గత ఏడాది కూడా అధిష్ఠానం ప్రయత్నించింది. శాసనసభాపక్ష సమావేశ నిర్వహణకే గహ్లోత్ విధేయులు అనుమతించకపోవడంతో అది వీలుపడలేదు.
సహనంతో ఉండాలి
గహ్లోత్
తాను, సచిన్ కలిసి పనిచేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి చేరుస్తామని గహ్లోత్ ప్రకటించారు. ఒక హోదాలో సేవలందించడానికి సహనంతో వేచి ఉండాలని పార్టీ కార్యకర్తలు, నాయకులకు నర్మగర్భంగా సూచించారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది అధిష్ఠానం చూసుకుంటుందని, మూడుసార్లు సీఎంగా, మరో మూడుసార్లు కేంద్ర మంత్రిగా చేసినందువల్ల తనకు పదవులు ముఖ్యం కాదని మంగళవారం దిల్లీలో స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి