Kakinada: ఏం చేశారని జగన్కు ఓటేయాలి..?
‘ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఏం చేశారని మేం ఓటేయాలి? మాకు ఏమీ వద్దు. మేమేమీ తీసుకోం.. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటు వేసేది లేదు’ అని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎదుట ఓ మహిళ తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యే ద్వారంపూడి ఎదుట మహిళ ఆక్రోశం
కాకినాడ కలెక్టరేట్, న్యూస్టుడే: ‘ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఏం చేశారని మేం ఓటేయాలి? మాకు ఏమీ వద్దు. మేమేమీ తీసుకోం.. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటు వేసేది లేదు’ అని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎదుట ఓ మహిళ తీవ్ర ఆక్రోశం వ్యక్తంచేశారు. శుక్రవారం నగరంలోని ఆరో డివిజన్ రేచర్లపేట ఎస్సీకాలనీలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటింటా పర్యటించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే ఓ ఇంటికి వెళ్లగా ఆ గృహస్థురాలు ఒక్కసారిగా.. ‘తమకేమీ వద్దని, తామేమీ తీసుకోమని, ఓటు కూడా వేసేది లేద’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అవాక్కయిన ఎమ్మెల్యే అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. ఆయన వెంట వచ్చిన వైకాపా నాయకులు ఆమెను సముదాయించడానికి ప్రయత్నించారు. ‘సార్తో అలా మాట్లాడవచ్చా..’ అని ప్రశ్నించగా ఆమె బదులిస్తూ.. ‘ఇల్లు లేనివారిని పట్టించుకోరు. మీ సార్ ఎవరికి గొప్ప? మేం అడిగితే చెడ్డ.. అన్నింటి ధరలు పెరిగిపోయాయి. 20 ఏళ్లుగా అద్దె ఇంటిలో ఉంటున్నాం. పట్టించుకునే నాథుడే లేడు. గతంలో ఇచ్చిన పట్టానూ వెనక్కి తీసుకున్నారు. మళ్లీ 90 రోజుల తరువాత ఇస్తారట. ఈలోగా జగన్ పదవి అయిపోతుంది. చేతులు దులిపేసుకుంటారు’ ఆమె తీవ్రంగా స్పందించారు. ‘ఎవరికి ఇల్లు ఉందో.. ఎవరికి లేదో పట్టించుకోండి. కాలువల్లో చెత్త తీసి బయట వేస్తారు. వారం రోజుల వరకు తొలగించరు. దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్నాం’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి ఒక్క ఓటూ ముఖ్యమే.. ‘సర్కార్’లో సెన్సేషనల్ సీన్ చూశారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
అభిమానులారా మ్యాచ్ ముగిసినా వెళ్లొద్దు.. మీకో స్పెషల్ ఉంది: వైరల్గా చెన్నై పోస్టు
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు