‘జమిలి’ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం
‘‘దేశం ఇంటాబయటా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతూ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది.
మహిళా బిల్లును తక్షణమే ఆమోదించండి!
జన, కుల గణనలు చేపట్టాల్సిందే
రిజర్వేషన్ల పరిమితినీ పెంచాలి
మోదీ అన్నింటా విఫలమయ్యారు
సీడబ్ల్యూసీలో తొలిరోజు 14 తీర్మానాలు
- మహిళా సాధికారతను సాధించడానికి.. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి.
- ఒకే దేశం- ఒకే ఎన్నిక అనే ప్రతిపాదన దేశ సమాఖ్యపై దాడివంటిది. జమిలి ఎన్నికల అంశాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం.
- రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని మార్చాలని, నూతన రాజ్యాంగాన్ని తీసుకురావాలనే వాదనలను తిరస్కరిస్తున్నాం.
- సామాజిక భద్రత, న్యాయం అందించడానికి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడాన్ని హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నాం.
ఈనాడు, హైదరాబాద్: ‘‘దేశం ఇంటాబయటా సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతూ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోంది. చైనాను సరిహద్దుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు రానీయబోమని ప్రధాని చెబుతున్నా, వాస్తవానికి దానికి భిన్నంగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదించాలి. ఒకే దేశం.. ఒకే ఎన్నిక ప్రతిపాదనను మేం తిరస్కరిస్తున్నాం. పేదలకు మేలు జరిగేలా జన, కులగణన రెండింటినీ ఏకకాలంలో చేపట్టాలి. రిజర్వేషన్లనూ పెంచాలి’’ అని సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. మణిపుర్, కశ్మీర్ రాష్ట్రాల్లో హింసపైనా కమిటీ సమావేశాల్లో లోతుగా చర్చించడం గమనార్హం. తాజ్కృష్ణా హోటల్లో శనివారం తొలిరోజు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో మొత్తం 14 అంశాలపై చర్చించి తీర్మానాలు, చేసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. వివిధ అంశాల తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేసింది. వీటిలో ప్రధాన అంశాలివే...
- ధరలు, నిరుద్యోగం పెరిగిపోతున్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోదీ విఫలమయ్యారు. 2021 జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు. 2011 జనాభా లెక్కల ప్రకారం రేషన్కార్డులు ఇవ్వడంతో 14 కోట్ల మంది పేదలకు అన్యాయం జరుగుతోంది. కులగణన చేయకపోవడం బీసీలపై భాజపా చూపుతున్న వివక్షకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కోటా పరిమితిని పెంచాలి.
- అదానీ వ్యాపార సంస్థ లావాదేవీలపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ(జేపీసీ) వేయాలి. ఈ లావాదేవీల్లో ప్రభుత్వ పక్షపాతం, పరిపాలనా లోపాలపై విచారణ జరపాలి. ప్రధానితో సన్నిహిత స్నేహం కారణంగానే అదానీ లబ్ధి పొందారు.
- అరుణాచల్ప్రదేశ్తోపాటు మరికొన్ని ప్రాంతాలు తమవేనని చైనా దేశపటాలను ముద్రించడమే కాకుండా సరిహద్దులను ఆక్రమించడాన్ని ఖండిస్తున్నాం.
- కుల, మత, పేద, ధనిక, యువత, వృద్ధులనే తారతమ్యం లేకుండా దేశమంతా ఒకటే అనే సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తాం.
- కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన పౌరులు, పోలీసుల మృతిపై మేం సంతాపాన్ని వెలిబుచ్చుతున్నాం. ఇంత విషాదం జరిగితే భాజపా, ప్రధాని జీ-20 సమావేశాలు విజయవంతం అయ్యాయని వారికి వారే ప్రశంసించుకోవడం క్షమార్హం కాదు.
- రాజ్యాంగ పరిరక్షణకు, సామాజిక న్యాయం, సాధికారత సాధనకు గత ఏడాది కాలంగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న ఖర్గేని మా పార్టీ ప్రశంసిస్తోంది.
- కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్గాంధీ చేసిన ‘భారత్ జోడో యాత్ర’ పూర్తయి ఏడాది అయింది. ఈ యాత్ర దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చింది. రాజకీయ కక్షతోనే రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు వేశారు. తిరిగి సభ్యత్వ పునరుద్ధరణతో న్యాయం జరిగింది.
- రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయనందునే మణిపుర్లో హింస కొనసాగుతోంది. తక్షణమే ఆ రాష్ట్ర సీఎంను తొలగించాలి.
- ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక మొదటిసారి స్వాతంత్య్ర దినోత్సవ సభలో ప్రసంగిస్తూ కులం, మతం, ప్రాంతీయతత్వంపై పదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. కానీ, గత తొమ్మిదేళ్లలో ప్రధాని అనుసరించిన వివక్షాపూరిత విధానాలతో ఇవన్నీ బాగా పెరిగాయి. రాజకీయ కక్షతో నాయకులను వేధించడానికి విచారణ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. సహకార సమాఖ్య విధానాలను భాజపా ప్రభుత్వం నాశనం చేస్తోంది.
- రైతు సంఘాల డిమాండు మేరకు పంటలకు మద్దతు ధర అంశాలను పరిష్కరించాలని ప్రధానికి గుర్తు చేస్తున్నాం.రుణాల భారం పెరిగి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో ఉంది. ప్రభుత్వసాయం అందక, పెద్దనోట్ల రద్దుతో మధ్య, చిన్నతరహా సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఆర్థికవ్యవస్థ అంధకారంలో చిక్కుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి