Dharmana Prasada Rao: ‘తెదేపా అంటే ఎందుకంత మోజు?’

తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత మోజు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు మత్స్యకారులను ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోని పెద్దగనగళ్లవానిపేటలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

Updated : 07 Oct 2023 08:40 IST

మత్స్యకారులను ప్రశ్నించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం(కలెక్టరేట్), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత మోజు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) మత్స్యకారులను ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోని పెద్దగనగళ్లవానిపేటలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాం. మీకు అండగా ఉంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇన్ని విధాలుగా ఆదుకుంటున్నా... తెలుగుదేశం పార్టీ అంటే మీకు ఎందుకంత మోజు? విపక్షాల అసత్య ప్రచారాలను నమ్మొద్దు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపా పోయింది. ఇప్పుడు ఆ పార్టీలో ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకునే నాయకులు లేరు. చంద్రబాబే అవినీతి కేసులో అరెస్టయ్యారు. మేలు చేసే ప్రభుత్వానికి అండగా నిలవాలి’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని