గజ్వేల్లో ఈటల పోటీ చేస్తే మద్దతిస్తాం: భారాస అసంతృప్త నాయకుల నిర్ణయం
‘అభివృద్ధి చేశామని చెబుతున్నారు... ఎక్కడ సీఎం ఉన్నా అక్కడ అభివృద్ధి జరగటం సర్వసాధారణం... మాకు ఆత్మాభిమానం ముఖ్యం... అది లేని చోట మేము ఉండలేం’ అంటూ గజ్వేల్ నియోజకవర్గ భారాస అసంతృప్త నాయకులు అన్నారు.
గజ్వేల్, న్యూస్టుడే: ‘అభివృద్ధి చేశామని చెబుతున్నారు... ఎక్కడ సీఎం ఉన్నా అక్కడ అభివృద్ధి జరగటం సర్వసాధారణం... మాకు ఆత్మాభిమానం ముఖ్యం... అది లేని చోట మేము ఉండలేం’ అంటూ గజ్వేల్ నియోజకవర్గ భారాస అసంతృప్త నాయకులు అన్నారు. గజ్వేల్ నుంచి భాజపా నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని టీవైఆర్ గార్డెన్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియా మాజీ ఛైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ ఏఎంసీ మాజీ ఛైర్మన్ టేకులపల్లి రాంరెడ్డి, ములుగు జడ్పీటీసీ మాజీ సభ్యుడు సింగం సత్తయ్య, గజ్వేల్ మాజీ ఎంపీపీ రాజు, నాయకులు సురేశ్ గౌడ్, వివిధ మండలాలలోని పలువురు సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఎంతో సంతోషించామని.. ఆయన సీఎం అయ్యాక ఇక్కడ నాయకులకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. అందుబాటులో లేకపోవటం, ఉద్యమకారులను విస్మరించటంతో మనస్తాపానికి గురయ్యామన్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా గుర్తింపు లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం