Gummadi Narsaiah: ‘గుమ్మడి’ని గుర్తుపట్టారా..

వీరు ఎవరో గుర్తుపట్టారా...! ఉమ్మడి రాష్ట్రంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య.

Updated : 04 Nov 2023 07:32 IST

వీరు ఎవరో గుర్తుపట్టారా...! ఉమ్మడి రాష్ట్రంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకులగూడెంలో నివాసం ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయన సీపీఐ(ఎంఎల్‌)తో 1981 సంవత్సరంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తొలుత గ్రామంలో సర్పంచిగా గెలుపొందారు. 1983లో ఇల్లెందు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తదుపరి 1985, 1989లలోనూ వరుసగా గెలిచారు. మళ్లీ 1999, 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏడు పదుల వయసులోనూ ఇప్పటికీ వ్యవసాయ పనులు చేస్తారు. వర్తమాన అంశాలపై అవగాహన కోసం పత్రికలు, పుస్తకాలు చదువుతారు.

ఈనాడు, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని