Telangana Elections: కారులేని మల్లారెడ్డి.. అప్పులు లేని భట్టి!
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడవిట్లు సమర్పించారు.
ధర్మపురి అర్వింద్ ఆస్తి రూ.107 కోట్లు
అఫిడవిట్లలో నేతలు పేర్కొన్న వివరాలివీ...
ఈనాడు, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడవిట్లు సమర్పించారు. భారాస ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు, కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు తమ ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తనకు రూ.95 కోట్లకుపైగా ఆస్తులున్నట్టు పేర్కొన్నప్పటికీ.. చేతిలో ఒక్క రూపాయి నగదు లేదని, తనకు కారు కూడా లేదని అఫిడవిట్లో పొందుపరిచారు. మంత్రి గంగుల కమలాకర్ పలు సంస్థల్లో వ్యాపార భాగస్వామ్యం ఉన్నట్లు పొందుపరిచారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 6 కేసులు, రూ.18.77 కోట్ల ఆస్తులు, రూ.5.99కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టివిక్రమార్క తన అఫిడవిట్లో రూ.8.12 కోట్ల ఆస్తులున్నాయని, అప్పులేవీ లేవని తెలిపారు. నాగర్కర్నూలు భారాస అభ్యర్థి మర్రి జనార్దన్రెడ్డి రూ.112.23 కోట్లు ఆస్తులున్నాయి. కోరుట్ల నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న ధర్మపురి అర్వింద్ తనపై 17 కేసులతో పాటు రూ.107.43 కోట్ల ఆస్తులున్నాయని వెల్లడించారు.
భారాస : మేడ్చల్ నుంచి పోటీచేస్తున్న మంత్రి మల్లారెడ్డి రూ.95.95కోట్ల ఆస్తులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా సూరారం, కండ్లకోయ, ధూలపల్లి, జీడిమెట్ల, గుండ్ల పోచంపల్లి, గుండ్ల పోచారం గ్రామాల్లో వ్యవసాయ భూములు.... మైసమ్మగూడ, ఫిరోజ్గూడ, బోయిన్పల్లి, కొంపల్లి, అబిడ్స్లో వాణిజ్య భవనాలున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. తన పేరుమీద రూ.41,40,10,776, తన భార్య కల్పనకు రూ.38,69,25,565, డిపెండెంట్ పేరుమీద రూ.10,14,72,400 స్థిరాస్తులున్నాయని... తమ చరాస్తుల విలువ 5,70,64,666గా పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో అప్పులు రూ.7.5కోట్లున్నాయని తెలిపారు.
కరీంనగర్ నుంచి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ రూ.34.08కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఇందులో దాదాపు రూ.7కోట్ల విలువైన బంగారు వజ్రాభవరణాలు ఉన్నాయి. మొత్తంగా రూ.11.53 కోట్ల చరాస్తులు మంత్రి పేర ఉండగా.. ఆయన సతీమణి పేరిట రూ.7.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో రాశారు. తన పేరు మీద స్థిరాస్తుల విలువ రూ.13.97 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. భార్య పేరిట స్తంభంపల్లి, గుండ[్లపల్లిలో రూ.82.70 లక్షల విలువైన 5 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు పేర్కొన్నారు. రూ.50.63 లక్షల రుణాలున్నట్లు వెల్లడించారు..
పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తున్న కందాల ఉపేందర్రెడ్డి రూ.89.57కోట్ల విలువైన ఆస్తులు ప్రకటించారు. ఇందులో ఆయన భార్యపేరిట 82 లక్షల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ అభ్యర్థి శంకర్నాయక్ కుటుంబానికి 52.23 ఎకరాల వ్యవసాయభూమి, వాణిజ్యభవనాలు ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ రూ.21.06 కోట్లుగా ప్రకటించారు. ఖైరతాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్కు వజ్రాల విలువ రూ.6.68కోట్లుగా ప్రకటించారు. మూడు కిలోల బంగారం, 54.17 ఎకరాల వ్యవసాయభూములు ఉన్నాయని వివరించారు. అడ్వాన్సులు, అప్పులు కలిపి రూ.49.55కోట్లు ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ : సనత్నగర్ అభ్యర్థి కోట నీలిమకు 8.01 కిలోల బంగారు ఆభరణాలు, నాణేలు ఉన్నాయి. రాజస్థాన్లో 10.15 ఎకరాల వ్యవసాయభూమి, ఇల్లు ఉందని అఫిడవిట్లో తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.54.75కోట్లుగా ప్రకటించారు. ఇందులో తనపేరిట స్థిర, చరాస్తులు కలిపి రూ.52కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. సంగారెడ్డి అభ్యర్థి తూర్పు జయప్రకాష్ పేరిట 20 కేసులు ఉన్నాయి. వనపర్తి అభ్యర్థిగా పోటీచేస్తున్న తుడి మేఘారెడ్డి కుటుంబానికి దాదాపు 60 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆయన తన కుటుంబం మొత్తానికి రూ.23.25కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. ములుగు అభ్యర్థి సీతక్క రూ.82 లక్షల ఆస్తులతో పాటు గృహరుణం రూ.24.74 లక్షలు ఉందని పేర్కొన్నారు. ఖానాపూర్ అభ్యర్థి వి.బొజ్జుపై 52 కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
PM Modi: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత విపక్ష కూటమి పేకమేడలా కూలిపోతుందని దుయ్యబట్టారు. -
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
రంజాన్ మాసంలో గాజాపై బాంబింగ్ ఆపాలని తాను ఇజ్రాయెల్ను కోరినట్లు ప్రధాని మోదీ చెప్పారు. -
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. -
గర్భిణిగా ఉన్న నా చెల్లి కడుపుపై తన్నారు: వైకాపా మూక దాడిలో గాయపడిన నూకరత్నం
ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు. -
మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్ బి’ ఉందా..? అమిత్ షా సమాధానమిదే..
Lok sabha elections: లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ రాకపోతే.. తదుపరి ప్లాన్ ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమాధానం ఇచ్చారు. -
అధికారులంతా వైకాపాకే కొమ్ముకాశారు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. -
ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచిపెట్టాలని యోచిస్తున్నామని, ఇందుకు న్యాయ సలహాలను తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు. -
వైకాపాకు 25 స్థానాలైనా దక్కవు: రఘురామకృష్ణరాజు
వైకాపాకు 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఎంపీ, ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణ రాజు అన్నారు. -
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్