అయిదేళ్లలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం.
తొలి ఓటుతో భవితకు పునాదులు వేసుకోవాలి
యువతతో ముఖాముఖిలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్
అమలాపురం ప్రాంతంలో ‘యువగళం’ పాదయాత్ర
ఈనాడు, రాజమహేంద్రవరం: ‘తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఆరు లక్షల మందికి, డీఎస్సీ ద్వారా 32 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. మూడు నెలలు ఓపిక పట్టండి.. అయిదేళ్లలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. వైకాపా చర్యల వల్ల రాష్ట్రం, మనం నష్టపోయాం. ప్రస్తుత పరిస్థితి చక్కదిద్దాలన్నా, రాష్ట్ర బ్రాండ్ను కాపాడాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం. తొలిసారి ఓటు హక్కు వినియోగించే మీరంతా ఆలోచించి మీ భవిష్యత్తుకు గ్యారంటీనిచ్చే పార్టీకి ఓటేయండి. తెదేపా-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి యువ జోష్ చూపించండి..’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. యువగళం పాదయాత్రలో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం భట్నవిల్లిలో మంగళవారం యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.
తిరస్కరించడం.. తరిమేయడం
‘ఈ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్ల అప్పు చేసినందున రూ.లక్ష కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసి సంక్షేమం అమలు చేయడం వల్ల ప్రజలపై ఛార్జీల భారం వేయలేదు. తెదేపా హయాంలో సింగపూర్ సాంకేతికతతో రాజధాని మాస్టర్ప్లాన్ రూపొందిస్తే వైకాపా వచ్చాక తిరస్కరించింది. విశాఖలో మిలీనియం టవర్స్ను తాత్కాలిక సచివాలయంగా వాడతారట. హెచ్ఎస్బీసీ, అమరరాజా యూనిట్ను తరిమేశారు. వీరి వేధింపుల వల్ల లూలూ గ్రూప్ ఏపీలో తప్ప ఎక్కడైనా పెట్టుబడులు పెడతా మంది. ఈ భూమి మీద నేను.. జగన్ శాశ్వతం కాదు. ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం..’ అని లోకేశ్ పేర్కొన్నారు.
నిరుద్యోగులుగా మిగిలాం
ముఖాముఖిలో పలువురు యువతీ యువకులు మాట్లాడారు. ‘2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రెండు డీఎస్సీలు ప్రకటించారు. వైకాపా అధికారంలోకి వస్తే 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని జగన్ హామీనిచ్చి వంచించారు. 1.36 లక్షల సచివాలయ ఉద్యోగాలిచ్చామని చెబుతున్నా అందులో సాధారణ డిగ్రీ చదివినవారికి అన్యాయమే జరిగింది. నవరత్నాలని గొప్పలు చెప్పే సీఎం వల్ల నిరుద్యోగ రత్నాలుగా మిగిలాం’ అని యువకుడు వెంకటేశ్ వాపోయారు. తెదేపా-జనసేన ప్రభుత్వంలో ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని లోకేశ్ ఈ సందర్భంగా హామీనిచ్చారు. రెండేళ్లుగా ఫీజు రీఎంబర్స్మెంట్ రావడం లేదని విద్యార్థినులు మహాలక్ష్మి, సాయికల్యాణి చెప్పగా.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రస్తుత రీఎంబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులు, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా నేరుగా కళాశాలతోనే ప్రభుత్వం ఒప్పందం చేసుకునేలా చూస్తామని అన్నారు. ‘మీరు రాజకీయాల్లో ఉన్నా మీ తల్లి, మీ భార్యను ఈ ప్రభుత్వం వేధిస్తోంది. ఇక సామాన్యుల పరిస్థితేంటి?’ అని వైద్య విద్యార్థిని సమ్రి ప్రశ్నించారు. మహిళలను గౌరవించేలా నర్సరీ స్థాయి నుంచి అవగాహన చర్యలు చేపడతామని లోకేశ్ చెప్పారు.
యువగళం.. జనబలం
పాదయాత్ర పొడవునా వివిధ వర్గాల ప్రజలు లోకేశ్కు ఘన స్వాగతం పలికారు. పేరూరులో ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్ ముమ్మిడివరం వరకు 18.5 కి.మీ.మేర నడిచారు. మార్గమధ్యలో ఆక్వా రైతులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఎస్సీ, కాపు, రెడ్డి, బీసీ సామాజికవర్గ ప్రతినిధుల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీనిచ్చారు. బందోబస్తుకు వచ్చిన పలువురు పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు తమ చొక్కాలపై నేమ్ ప్లేట్లు లేకుండా కనిపించారు. వీరిలో కొందరు చొక్కాలకు బాడీవోర్న్ కెమెరాలు ధరించి లోకేశ్ను కలుస్తున్న, వినతిపత్రాలు ఇస్తున్నవారిని చిత్రీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
హామీల అమలుపై చిత్తశుద్ధి ఏదీ?
ప్రగతి పట్టని, సరైన దిశానిర్దేశం లేని, హామీల అమలుపై చిత్తశుద్ధి లేని బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్